సందీప్ కిష‌న్ హీరోగా తాజాగా విడుద‌ల అయిన సినిమా ‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’. ఈ సినిమాకు కార్తీక్ రాజు దర్శకత్వం వ‌హించారు. సందీప్ కిషన్ హీరోగా అన్య సింగ్ హీరోయిన్ గా జూలై 12 విడుద‌ల అయింది. అయితే వ‌రుస ఫ్లాపుల‌తో ఉన్న సందీప్‌కు ఈ సినిమా హిట్ ఇచ్చింది. నిజానికి సందీప్ హిట్ అనే విష‌యం మ‌ర‌చిపోయి చాలా రోజులు అయింది. వరుస ప్లాపులతో మార్కెట్ మొత్తం కోల్పోయి ఉన్నాడు.


ఇప్పుడు తాజాగా సందీప్ కిష‌న్ ఈ ఒక్క సినిమాతో  బాక్సాఫీస్ వద్ద ఆరు రెట్లు ఎదగటం అంటే.. మాములు విషయం కాదు. సందీప్ లాస్ట్ సినిమాల‌కు ఈ సినిమాకు పొంత‌నే లేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ టాక్‌తో మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌డుతోంది. మొదటి రోజు ఈ సినిమాకు గ్రాస్ 1.70 కోట్లు వచ్చాయి. ఈ సక్సెస్ కి సందీప్ కిషనే ప్రధాన కారణం అని చెప్పాలి.


నిజానికి వ‌రుస ఫ్లాపుల‌తో వ‌స్తున్న సందీప్ కిష‌న్ ఆ సినిమాల్లో ఉన్న లోపాలు, త‌ప్పుల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకు జాగ్ర‌త్త‌లు వ‌హించారు. ఈ కోణంలోనే తాను ఒక నిర్మాత‌గా కూడా మారి తాను అనుకున్న విధంగా సినిమా వ‌చ్చే వ‌ర‌కు ఖ‌ర్చు పెట్టి ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. ఏట్ట‌కేల‌కు త‌న ఫ్లాపుల్లో ఉన్న లోపాలు తెలుసుకుని హిట్ కొట్టి ఇప్పుడున్న యంగ్ హీరోల‌కు ఆద‌ర్శంగా మారాడు. ఈ ఒక్క సినిమాతో ఏకంగా ఆరు రెట్లు ఎక్కువ కలెక్షన్స్ ను రాబట్టుకుని నిజ‌మైన స‌క్సెస్ అంటే ఏంటో తెలిసేలా చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: