మహేష్ మహర్షి తరువాత వెంటనే 26 వ సినిమా సరిలేరు నీకెవ్వరూ మొదలు పెట్టారు.  ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతున్నది.  సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు అయితే, సినిమాకు సినిమాటోగ్రాఫర్ ఎవరు అన్నది మొన్నటి వరకు ప్రకటించలేదు.  


అనేకమంది పేర్లను పరిశీలించిన తరువాత ఫైనల్ గా రత్నవేలును కన్ఫర్మ్ చేశారు.  రత్నవేలు టాలీవుడ్ లో చాలా బిజీగా ఉన్నారు.  సైరా షూటింగ్ పూర్తైన వెంటనే ఆయన మహేష్ సినిమా కోసం కాశ్మీర్ చేరుకున్నారు.  కాశ్మీర్ లో షూటింగ్ ను స్టార్ట్ చేశారు.  


గతంలో 1 నేనొక్కడినే, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.  మహేష్ కు ఇష్టమైన సినిమాటోగ్రాఫర్లలో ఈయన కూడా ఒకరు.  ఈ సినిమా షూటింగ్ ను శెరవేగంగా షూట్ చేస్తున్నారు.  కాశ్మీర్ షూట్ పూర్తవ్వగానే అన్నపూర్ణలో వేసిన ట్రైన్ సెట్ లో షూట్ జరుగుతుంది.  


ట్రైన్ సెట్ లో జరిగే షూట్ ఎక్కువ రోజులు జరిగే అవకాశం ఉంది. ఈ ట్రైన్ సెట్ కోసం ఏకంగా 3 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.  రష్మిక హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీలో విజయశాంతి కీలక రోల్ ప్లే చేస్తున్నది.  టాలీవుడ్ లో టాప్ కమెడియన్స్ అందరు ఈ మూవీలో నటిస్తున్నారని వినికిడి.  


మరింత సమాచారం తెలుసుకోండి: