తెలుగులో సంచలన విజయం అందుకున్న అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రీమేక్ లో షాహిద్ కపూర్ హీరోగా చేశారు. కియారా అద్వానీ హీరోయిన్. తక్కువ ఖర్చుతో తెరకెక్కిన ఈ మూవీ రిలీజైన నాలుగు వారాల్లో ఏకంగా 250 కోట్లకు పైగా వసూలు చేసి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది.
షాహిద్ కపూర్ సోలో హీరోగా వందకోట్లు ధాటిని రెండో సినిమా ఇది. రెండు వందల కోట్లు వసూలు చేసిన మొదటి సినిమా. అడల్ట్ కంటెంట్ ప్లస్ సినిమాపై పాజిటివ్ టాక్ రావడంతో ఈ స్థాయిలో వసూలు వస్తున్నాయి. రిలీజ్ అయ్యి నాలుగు వారాలైనా ఇంకా కలెక్షన్లు తగ్గలేదు.
రీసెంట్ గా హృతిక్ రోషన్ సూపర్ 30 రిలీజ్ అయ్యింది. ఈ మూవీ బాగుందని టాక్ వచ్చింది. ఈ సినిమా ప్రభావం కబీర్ సింగ్ పై ఉంటుంది అనుకున్నారు. కానీ, దానిపై అసలు కొద్దిగా కూడా ప్రభావం లేదు. ఇదే విధమైన ఒరవడి సృష్టిస్తే.. సినిమా లాంగ్ రన్ లో 300 కోట్లు వసూలు చేయడం ఖాయం అని సినీ విశ్లేషకులు చెప్తున్నారు.
బాలీవుడ్ టాప్ కలెక్షన్ల సినిమాల లిస్ట్ లో కబీర్ సింగ్ 10 స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగకు బాలీవుడ్ లో ఇప్పుడు భారీ డిమాండ్ పెరిగింది. ఈ సినిమా తరువాత షాహిద్ కపూర్, అటు నిర్మాతలు సందీప్ తో మరో సినిమా చేయడానికి రెడీ అయ్యారు.