మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. అనుకున్న విధంగా ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే ‘బాహుబలి’ రికార్డులు బ్రేక్ అయినా ఆశ్చర్యం లేదు అన్న ఊహలలో మెగా అభిమానులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో అక్టోబర్ 2న విడుదకాబోతున్న ‘సైరా’ మ్యానియాను లెక్క చేయకుండా యంగ్ హీరో నితిన్ అడుగు వేయడం షాకింగ్ గా మారింది. 

 హీరో నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాకు ‘ఫరెవర్ సింగిల్ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో నితిన్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది.  ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ సినిమాను దసరా సీజన్లో రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని వార్తలు గుప్పు మంటున్నాయి.  

అయితే  'సైరా' కూడ దసరా సీజన్ లో వస్తున్న నేపధ్యంలో నితిన్ ఇలాంటి సాహసం ఎలా చేస్తున్నాడు అంటూ చాలమంది ఆశ్చర్య పోతున్నారు. కామెడి ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈమూవీ పై నితిన్ కు భారీ అంచనాలు ఉన్నా ఏకంగా ‘సైరా’ తో పోటీ అసలు జరిగే పనేనా అన్న కామెంట్స్ వస్తున్నాయి.  

దీనికితోడు ఇలాంటి సాహసానికి ఈసినిమాను నిర్మిస్తున్న సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్వాహకులు అంగీకరించరని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు ఇది అంతా కేవలం ప్రస్థుతం మార్కెట్ లేని నితిన్ సినిమాలకు మార్కెట్ క్రియేట్ చేయడానికి వ్యూహాత్మికంగా ప్రచారంలోకి తీసుకు వస్తున్న లీకులు మాత్రమే అంటూ ఈవార్తలను లైట్ గా తీసుకుంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు..   



మరింత సమాచారం తెలుసుకోండి: