ఈ సంవత్సరం అక్కినేని ఫ్యామిలీ సంవత్సరంగా మారిపోతుందా అంటూ ఇండస్ట్రీలో కామెంట్స్ వస్తున్నాయి. సమ్మర్ రేస్ కు వచ్చిన ‘మజిలీ’ సక్సస్ ను ఇస్తే లేటెస్ట్ గా విడుదలైన ‘ఓ బేబి’ కలక్షన్స్ హవా కొనసాగిస్తూ నిన్నటితో ముగిసిన వీకెండ్ లో కూడ రికార్డు కలక్షన్స్ ను తెచ్చుకుంది. 

ఇది చాలదు అన్నట్లుగా ఆగష్టులో విడుదల కాబోతున్న ‘సాహో’ మ్యానియాను లెక్క చేయకుండా నాగార్జున ‘మన్మధుడు 2’ ఆగష్టు 9న విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. సుమారు 40 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈమూవీ 200 కోట్ల ‘సాహో’ తో పోటీ పడటం అత్యంత ఆశ్చర్యంగా మారింది. 

ఇది చాలదు అన్నట్లుగా అక్టోబర్ 2 గాంధీజయంతినాడు దసరా సీజన్ ను దృష్టిలో పెట్టుకుని విడుదల అవుతున్న సైరా’ ను టార్గెట్ చేస్తూ వెంకటేష్ నాగాచైతన్యల ‘వెంకీ మామ’ దసరా రేస్ కు రెడీ అవుతున్నట్లు ఈమూవీ నిర్మాతల నుండి లీకులు వస్తున్నాయి. ‘వెంకీ మామ’ బడ్జెట్ కూడ 40 కోట్లు మాత్రమే అయితే ఈమూవీ కూడ 200 కోట్ల ‘సైరా’ తో పోటీ పడుతోంది. 

ఇప్పుడు ఇలా అక్కినేని ఫ్యామిలీ హీరోల సినిమాలు ప్రభాస్ చిరంజీవిల భారీ సినిమాల మ్యానియాను లెక్క చేయకుండా విడుదల కావడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఈభారీ సినిమాలలో ఒకటి భారీ యాక్షన్ మూవీ అయితే మరొకటి భారీ చారిత్రాత్మికం అయితే ఈ రెండు భారీ సినిమాలను కేవలం ఎంటర్టైన్మెంట్ ప్రధానంసంగా రూపొందింపబడ్డ అక్కినేని హీరోల మూవీలు టార్గెట్ చేయడం వీరి అత్యుత్సహమా లేకుంటే వీరి మితిమీరిన ఆత్మవిస్వాసమా అన్న విషయం రానున్న రోజులలో తేలిపోతుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: