తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య కొత్తగా వస్తున్న హీరో, హీరోయిన్లు ఇతర నటులు, దర్శకులు మంచి విజయాలతో సత్తా చాటున్నారు. ఆ మద్య అర్జున్ రెడ్డితో దర్శకులు సందీప్ వంగా కొత్త ట్రెండ్ సృష్టిస్తే..ఆర్ ఎక్స్ 100 చిత్రంతో అజయ్ భూపతి మరో ట్రెండ్ సృష్టించారు. అయితే ఈ రెండు చిత్రాలు కూడా బోల్డ్ కంటెంట్ ఉన్నా మంచి లవ్ స్టోరీ ఉండటంతో యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఆర్ ఎక్స్ 100 చిత్రంతో హీరోగా పరిచయం అయిన కార్తికేయ ఇటీవల హిప్పీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ప్రస్తుతం అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో గుణ 369 అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో కార్తికేయ సరసన అనగ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంకి సంబంధించి ఇటీవల టీజర్ విడుదల కాగా ఇందులో సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. చింతన్ భరద్వాజ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్గా పని చేస్తున్నారు.
ఆగస్ట్ 2న గుణ 369 చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి జూలై 17 ఉదయం 11.11 ని.లకి ట్రైలర్ని విడుదల చేయనున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శీను ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ట్రైలర్తో చిత్రంపై భారీ అంచనాలు పెంచాలని టీం భావిస్తుంది.