2019 సెకండాఫ్లో భారీ అంచనాలతో వస్తున్న తెలుగు సినిమా సాహో. ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్ట్ 15 వ విడుదల చేస్తామని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు సాహో సినిమా విడుదల డేట్ వాయిదా పడిందని తెలుస్తుంది. ఈ సినిమాను ఆగష్ట్ 30 వ తేదీన విడుదల చేయాలని సాహో టీమ్ నిర్ణయించుకున్నారట. 
 
సాహో రిలీజ్ డేట్ వాయిదా పడటానికి కారణం ఈ సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఆగస్ట్ 15 నాటికి సిద్ధం కావటం కష్టమట. దీనికి తోడు ఈ సినిమాకు ముందుగా అనుకున్న సంగీత దర్శకులు మారటం, చాలా భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తూ ఉండటంతో చివరి నిమిషంలో ఎటువంటి ఇబ్బందులు పడకూడదని ముందుజాగ్రత్తగా సాహో సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేసారట. 
 
దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్తో సాహో సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని సీన్లు హాలీవుడ్ రేంజ్లో ఉంటాయని తెలుస్తుంది. ఒక్క సీన్ కోసమే ఈ సినిమాలో 70 కోట్ల దాకా నిర్మాతలు ఖర్చు పెట్టారట. బాలీవుడ్ హీరోయిన్ శ్రధ్ధా కపూర్ ప్రభాస్ కు జోడీగా నటిస్తున్నారు.కేవలం ఈ సినిమా షూటింగ్ కోసం 130 కార్లను వాడారట. ఈ సినిమా కోసం ఎక్కువగా విదేశీ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: