బోయపాటి శ్రీను .. అల్లు అర్జున్ కాబినేషన్లో వచ్చిన సరైనోడు సరైన హిట్ కొట్టింది. మాస్ ను పక్కాగా ఆకర్షించిన ఈ మూవీ.. అప్పట్లో భారీ కలెక్షన్లు వసూలు చేసింది. ఆ తరువాత బోయపాటికి సరైన హిట్ లేదు. జయ జానకి నాయక, వినయ విధేయ రామ సినిమాలు చేశారు.
ఈ రెండు పెద్దగా విజయం సాధించలేదు. బాలకృష్ణతో సినిమా చేయాల్సి ఉన్నా.. అది ఎందుకో వాయిదా పడింది. ప్రస్తుతం బాలకృష్ణ కెఎస్ రవికుమార్ తో సినిమా చేస్తున్నారు. ఇటు అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 2020 లో రిలీజ్ కాబోతున్నది.
ఇదిలా ఉంటె అల్లు అరవింద్.. బోయపాటితో సినిమా ఉంటుందని ప్రకటించారు. సరైనోడు కంటే పక్కా మాస్ గా ఉండాలని కోరుకుంటున్నట్టు అల్లు అరవింద్ పేర్కొన్నాడు. సరైనోడు బాప్ గా ఉండాలి అంటే సరైనోడు 2 తీయాలి. ఆ స్థాయిలో సినిమా అంటే ఎలా ఉండాలో బోయపాటికే తెలియాలి.
అల్లు అరవింద్.. బోయపాటి సినిమా గురించి చర్చలు జరుపుకుంటున్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ ఇప్పటి వరకు స్పందించలేదు. త్రివిక్రమ్ సినిమా బిజీలో ఉన్నాడు. దీని తరువాత వేణు శ్రీరామ్ తో ఐకాన్ సినిమా చేయాల్సి ఉంది. అటు సుకుమార్ తో సినిమా చేయాల్సి ఉంది. ఈ మధ్యలో బోయపాటి సినిమా రావడంతో ఏ సినిమా చేస్తారో చూడాలి.