ఈమధ్య కాలంలో సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ జరిగాయి అంటే చాలు ఆ ఈవెంట్స్ లో ఎవరో ఒకరు మరొకర్ని టార్గెట్ చేస్తూ కార్యక్రమానికి హైలెట్ గా మారడం అలవాటుగా పెట్టుకున్నారు. ఈ కల్చర్ విజయ్ దేవరకొండ నుంచి ప్రారంభం అయింది. 

ఇప్పుడు విజయ్ అడుగుజాడలలో నడుస్తూ యంగ్ హీరో కార్తికేయ ఏకంగా అల్లు అరవింద్ పై సెటైర్లు వేయడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఈమధ్య కార్తికేయ నటించిన ‘హిప్పీ’ మూవీ ఫెయిల్ కావడంతో తన లేటెస్ట్ మూవీ ‘గుణ 369’ పై చాల ఆశలు పెట్టుకుని చాల గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు. 

ఈనేపధ్యంలో ఈమధ్య జరిగిన ఈమూవీ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ లో ఈ యంగ్ హీరో ఆ ఫంక్షన్ కు అతిధిగా వచ్చిన అల్లు అరవింద్ ను కార్నర్ చేస్తూ కామెంట్స్ చేయడం చూసిన వారు ఆశ్చర్యపోయారు. ఈమూవీ దర్శకుడు జంధ్యాల అల్లు అరవింద్ బన్నీతో తీసిన ‘సరైనోడు’ మూవీకి సహాయకుడుగా పనిచేసి ఇప్పుడు డైరెక్టర్ గా మారిన పరిస్థుతులలో తన మూవీ ‘సరైనోడు’ కన్నా భారీ హిట్ కొడుతుందని కార్తికేయ కామెంట్ చేసాడు. ఈ కామెంట్స్ కార్తికేయ మాటలలో విన్న వెంటనే వేదిక పై ఉన్న అల్లు అరవింద్ ముఖంలో రంగులు మారినా తమాయించుకుని నవ్వులు చిందించాడు. 

అయితే ఈ ఫంక్షన్ కు వచ్చిన వారు మాత్రం కార్తికేయ మూవీ కలక్షన్స్ బన్నీ సినిమా కన్నా ఎక్కువగా వస్తాయని ఆశ పడుతున్నాడా అంటూ జోక్ చేసుకున్నట్లు టాక్. ఇదే సందర్భంలో ఈ ఫంక్షన్ కు మరో అతిధిగా వచ్చిన బోయపాటి తాను అల్లు కాంపౌండ్ తో మరొక సినిమా తీస్తాను అంటూ అత్యుత్సాహంతో చెపుతుంటే మధ్యలో మైక్ తీసుకుని తాను ఆసినిమాలో హీరోని అంటూ కార్తికేయ అరవింద్ అడగకుండానే చెప్పుకోవడంతో ఈ యంగ్ హీరోకు యాక్షన్ తో పాటు మాటలు కూడ ఎక్కువైపోయాయి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కొందరు కామెంట్స్ చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: