'భరత్ అనే నేను' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకుని తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో ఆమెకు క్రేజ్ ఏర్ప‌డింది. ఆ త‌ర్వాత రామ్ చరణ్  వినయ విధేయ రామస న‌టించింది. ఈ సినిమా డిజాస్ట‌ర్ అయినా బాలివుడ్‌లో 'అర్జున్ రెడ్డి' రీమేక్ అయిన 'కబీర్ సింగ్' చిత్రంలో న‌టించి యువ‌త‌ను ఆక‌ట్టుకుంది. క‌బీర్‌సింగ్ ఇప్ప‌టికే రూ. 300 కోట్ల వ‌సూళ్లు దాటి దూసుకుపోతుంది. 


అలాగే  ఈ బ్యూటీ 'లస్ట్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్ లో నటించింది. అందులో 'మాస్టర్‌బేషన్‌' సీన్‌ ఇంటర్నెట్‌లో సంచలనమైంది. ఇటు సినిమాల్లో బోల్డ్ నెస్ చూపించే కియారా, బికినీ లో కనిపించడానికి కూడా సై అంటోంది. అందుకే బాలీవుడ్ లో చాలామంది నిర్మాతలు ఈమె కోసం క్యూ కడుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌తో రెండు సినిమాల్లో నటించేందుకు సంతకం చేసింది.


ప్ర‌స్తుతం బాలివుడ్ సీనియ‌ర్‌ హీరోయిన్లు స్టార్ హీరోల‌ను పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరం అవ్వ‌డంతో ఇప్పుడు స్టార్ హీరోలంద‌రికి కియారా ఆప్ష‌న్‌గా మారింది. దీంతో సినిమా ఇండియ‌న్ ఇండ‌స్ట్రీని మ‌కుటం లేని మ‌హారాణిగా ఏలేస్తోంది.  అయితే ఇలా బాలీవుడ్‌లో వరస సినిమాలతో బిజీగా ఉన్న కియారా టాలీవుడ్ లో ఇప్పటిలో సినిమాలు చేసే అవకాశం తక్కువ‌గానే క‌నిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: