యువసామ్రాట్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 3 ఈ రోజు నుండి స్టార్ మా ఛానెళ్ళో ప్రసారం కాబోతుంది. శుక్రవారం రోజే బిగ్ బాస్ సీజన్ 3 మొదటి ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేసారట బిగ్ బాస్ నిర్వాహకులు. సోషల్ మీడియాలో ఎవరి పేర్లైతే బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నారని వినిపిస్తున్నాయో ఒకరిద్దరు తప్ప వారే ఈ షోలో పాల్గొనబోతున్నారని సమాచారం. ఈ షోలో డియర్ కామ్రేడ్ సినిమా ప్రమోషన్ల కోసం విజయ్ దేవరకొండ పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది. 
 
బిగ్ బాస్ సీజన్2లో గీతా గోవిందం సినిమా ప్రమోషన్ల కోసం విజయ్ దేవరకొండ ఈ షోలో పాల్గొన్నాడు. గీతా గోవిందం సినిమా 70 కోట్ల రుపాయల షేర్ వసూలు చేసి విజయ్ దేవరకొండ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్లు సాధించింది. బిగ్ బాస్ షోలో పాల్గొంటే డియర్ కామ్రేడ్ సినిమా ప్రమోషన్లకు హెల్ప్ అవుతుందని విజయ్ ఈ షోలో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది.విజయ్ దేవరకొండ, రష్మికా మందన్న ఇద్దరూ ఈ షోలో పాల్గొంటున్నారట. బిగ్ బాస్ సీజన్2 సమయంలో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ ఈ షోలో పాల్గొన్నారు. 
 
బిగ్ బాస్ సీజన్ 1 ఎన్టీయార్ తన హోస్టింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ చేయగా సీజన్ 2 అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. మరి నాగార్జున హోస్ట్ చేస్తున్న సీజన్ 3 ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పటికే నాగార్జున హోస్ట్ చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు హిట్ కావడంతో సీజన్ 3 కూడా హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు ప్రేక్షకులు. మరి నాగార్జున అంచనాలు అందుకుంటాడో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: