పవన్ ఇమేజ్ ని వాడుకుని వోట్లు సంపాదిద్దామని కొన్ని రాజకీయ పార్టీ లు చేస్తున్న చీప్ ట్రిక్స్ చూస్తూ ఉంటే రాజకీయాలు ఇంత నీచంగా మారి పోతున్నాయా? అని ఎవరి కైనా అని పించకమానదు. ఈ విషయానికి సంబంధించి ఒక ఆశక్తి కర సంఘటన ఈ మధ్య వెలుగులోకి వచ్చిoది. పవన్ అత్తారిల్లు సూపర్ డూపర్ హిట్ కొట్టిన తరువాత పవన్ క్రేజ్ ను కేష్ చేసుకుందామని కోస్తా జిల్లాలలోని కొన్ని తెలుగు దేశo పార్టీ అభిమానులు పవన్ గబ్బర్ సింగ్ సినిమా లోని ఫోటో స్టిల్ కు తెలుగు దేశంపార్టీ కండువాతో మార్ఫింగ్ చేసి తెలుగు దేశం పార్టీ అభిమానుల మోటార్ సైకిళ్ళకు స్టికర్స్ గా అతికించడం టాపిక్ అఫ్ ది టాలీవుడ్ గామారి అనేక ఉహాగానాలకు వేదికగా మారింది.

ఈ నేపధ్యంలో తెలుగు దేశంపార్టీ కింగ్ మేకర్ రామోజీరావు పవన్ ను ఆ మధ్య కలిసాడు అని వచ్చిన వార్తలకు ఈ మోటార్ సైకల్ స్టికర్స్ వ్యవహారానికి ఏమైనా లింకు ఉందా? అంటూ పవన్ అభిమానులు భయ పడుతున్నారట. మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ మార్ఫింగ్ ఫోటోలు పవన్ దృష్టికి కూడా వెళ్ళాయి అనే టాక్ కూడా వినిపిస్తోంది. పవన్ క్రేజ్ ను ఇలా భవిష్యత్తులో ఎన్ని రాజకీయ పార్టీలు ఉపయోగించుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: