ఇస్మార్ట్  శంకర్ సినిమా ప్రమోషన్ ను పక్కన పెట్టి హీరో రామ్ విదేశీ టూర్ కి వెళ్లడం వెనుక మతలబు ఏంటన్న చర్చ ఫిలిం నగర్ వర్గాల్లో జరుగుతోంది.  దర్శకుడు పూరి జగన్నాథ్ తో వచ్చిన విభేదాల కారణంగానే హీరో రామ్ కుటుంబ సభ్యులతో సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమా విడుదలైన వెంటనే రామ్ విదేశాలకు చెక్కేయడం వెనుక పూరీ తో తలెత్తిన విభేదాలే కారణమై ఉంటుందన్న   సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి .


 ఏదైనా సినిమా విడుదలైతే దాని ఫలితం ఎలా ఉన్నా మరుసటి రోజు నుంచే ప్రమోషన్ కార్యక్రమాలు,  సక్సెస్ మీట్ లతో  హీరో,  హీరోయిన్లు,  దర్శకులు బిజీ అయిపోతారన్న విషయం తెలిసింది.  అయితే ఇస్మార్ట్ శంకర్ చిత్రం  విషయంలో మాత్రం దానికి  భిన్నంగా జరగడం ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో  హాట్ టాపిక్ గా మారింది . ఇస్మార్ట్ శంకర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలన్నీ  దర్శకుడు పూరీ జగన్నాథ్ తన భుజస్కందాలపై వేసుకోవడం...  హీరో రామ్ ఎక్కడ కూడా కనిపించకపోవడంతో అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగిందన్న దానిపై ఫిలింనగర్ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి .


 దర్శకుడు పూరి జగన్నాథ్,  హీరో రామ్ మధ్య విభేదాలు తలెత్తిన కారణంగానే రామ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదన్నది శుద్ధ అబద్ధమని ,  ఇందులో  ఏమాత్రం వాస్తవం లేదని , రామ్ ముందుగానే విదేశీ టూర్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడని,  అందుకే కుటుంబ సభ్యులతో విదేశీ టూర్ కు వెళ్లాడని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇస్మార్ శంకర్ విజయాన్ని రామ్ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నాడని అంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: