‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ప్రారంభం అయి ఆరు నెలలు దాటిపోతున్నా ఈమూవీ షూటింగ్ 30శాతం మించి పూర్తి అవ్వలేదు అని వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈసినిమాకు సంబంధించి హీరోయిన్స్ సమస్య కూడ పూర్తిగా పరిష్కారం కాలేదు. 

ఈమూవీలో నటించే జూనియర్ ఎన్టీఆర్ పక్కన ఈమూవీ కథ రీత్యా ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. అందులో ఒక పాత్ర బ్రిటీష్ బ్యూటీ. మొదట్లో ఈపాత్రకు బ్రిటీష్ హీరోయిన్ డైసీని ఎంపిక చేసినా ఆమె ఈమూవీ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో తిరిగి మరో ఫారెన్ బ్యూటీ వేట మొదలు పెట్టాడు రాజమౌళి.

తెలుస్తున్న సమాచారం మేరకు ఈమధ్య అమెరికా వెళ్ళిన రాజమౌళి ఈ విషయమై మరొక ఫారెన్ బ్యూటీతో చర్చలు జరిపి ఆమెను ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రాజెక్ట్ కు ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.  ఆమె పేరు ఎమ్మా రాబర్ట్స్ అని తెలుస్తోంది. ఈమె రెగ్యులర్ గా ఇంగ్లీష్ సినిమాలు చూసే వాళ్లకు పరిచయమే కానీ ప్రపంచమంతా తెలిసినంత పాపులర్ కాదు. వైల్డ్ చైల్డ్-నెర్వ్ లాంటి సినిమాలలో నటించి ఈమె హాలీవుడ్ లో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఈమెకు సంబంధించి స్క్రీన్ టెస్ట్ కూడ అమెరికాలో జరిగినట్లు టాక్. 

అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించవలసి ఉంది. ఇది ఇలా ఉండగా ఈమూవీలో మరో కీలక పాత్రకు సంబంధించి సాయి పల్లవి ఎంపిక ఖరార్ అయింది అని అంటున్నారు. చరణ్ జూనియర్ లకు స్వాతంత్రోద్యమ స్పూర్తిని కలిగించే ట్రైబల్ యువతీ పాత్రలో సాయి పల్లవి పాత్ర ఉంటుంది అని తెలుస్తోంది. ఈ ఇద్దరి హీరోయిన్స్ ఎంపిక పూర్తి అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ ను వెంటాడుతున్న హీరోయిన్స్ సమస్య ఇక పూర్తిగా తీరినట్లే అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: