సెలెబ్రెటీలకు కేరాఫ్ అడ్రస్ ఇంస్టాగ్రామ్.  సెలెబ్రిటీలంతా ఇంస్టాగ్రామ్ లో ఎక్కువగా ఉంటారు.  కారణం ఏంటి అంటే.. ఇంస్టాగ్రామ్ లో సెక్యూరిటీ ఉంటుంది.  హ్యాక్ అయ్యే అవకాశం తక్కువా.  పైగా ఫోటో బేస్డ్ ఫ్లాట్ ఫామ్ కాబట్టి ఫాలోయింగ్ పెంచుకోవచ్చు.  


దీంతో సెలెబ్రిటీలు హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో హీట్ పెంచుతుంటారు.  ముఖ్యంగా హీరోయిన్లు ఈ విషయంలో ముందు ఉంటారు.  వాళ్లకు ముందు చూపు చాలా ఎక్కువ.  అందుకే సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేసి ఫాలోవర్లు పెంచుకుంటారు.  


ఒకవేళ సినిమాలు లేకపోయినా.. ఒక్క ఫోటో షూట్ చేస్తే లక్షల్లో డబ్బులు వస్తాయి.  ఇంకా చెప్పాలంటే.. ఏదైనా బ్రాండ్ ను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తే కోట్లలో డబ్బు.  అందుకే వారంతా సోషల్ మీడియాను ఎంచుకుంటున్నారు.  ఈ విభాగంలో ముందు వరసలో ప్రియాంక చోప్రా ఉంటుంది.  


నిత్యం ఏదోఒక ఫోటోను సోషల్ మిడియాలో షేర్ చేస్తూ వేడి పెంచుతుంది.. తన ఇంస్టాగ్రామ్ పేజీలో ఒక ఫోటో షేర్ చేసి బ్రాండింగ్ చేయడానికి రెండు కోట్లు ఛార్జ్ చేస్తుందట.  ఇండియాలో ఈ రేంజ్ లో ఛార్జ్ చేస్తున్న స్టార్ ఈమొక్కతే.  విరాట్ కోహ్లీ బ్రాండింగ్ చేస్తే.. కోటి ముప్పై లక్షలు ఛార్జ్ చేస్తాడట.  చాలా బాగుంది కదా.  కదలకుండా ఇంట్లో కూర్చొని బ్రాండింగ్ చేయడం వలన డబ్బు సంపాదించవచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: