అక్కినేని నాగేశ్వరరావ్, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఇలా అక్కినేని ఫ్యామిలీ మూడు తరాలకు చెందిన నటులతో విక్రమ్ కె కుమార్ "మనం " అనే సినిమా తీశాడు. ఇలా మూడు తరాలకు చెందిన నటులు ఒకే సినిమాలో నటించటంతో పాటు అద్భుతమైన కథ, కథనం, సంగీతం కుదరడంతో మనం సినిమా అద్భుతమైన విజయం సాధించింది. స్మాల్ స్క్రీన్లో కూడా ఈ సినిమాకు ఇప్పటికీ మంచి రేటింగ్స్ వస్తున్నాయి. ప్రస్తుతం నాగార్జున మన్మథుడు 2 అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. 
 
నాగార్జున మన్మథుడు 2 లానే మనం2 సినిమాలో కూడా నటించబోతున్నాడని మన్మథుడు 2 సినిమాకు దర్శకత్వం వహించిన రాహుల్ రవీంద్రన్ మనం సీక్వెల్ కు దర్శకత్వం వహించబోతున్నాడని ఈ మేరకు కథ సిధ్ధం చేసాడని నిన్నటినుండి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి మనం సీక్వెల్ నిజంగా రాబోతుందా లేదా అని రాహుల్ రవీంద్రన్ ను ప్రశ్నిస్తే రాహుల్ రవీంద్రన్ ఒకింత ఆశ్చర్యంతో మనం సినిమా సీక్వెల్ ఆలోచన ఏమీ ప్రస్తుతానికి లేదని, ప్రస్తుతం మన్మధుడు2 సినిమా ఫలితం కోసం ఎదురు చూస్తున్నానని ఈ సినిమా విడుదలయ్యాకే కొత్త సినిమా గురించి ఆలోచిస్తానని క్లారిటీ ఇచ్చాడు. అందువలన ప్రస్తుతానికి మనం సీక్వెల్ ప్రతిపాదన ఏదీ లేదని తెలుస్తోంది. 
 
నాగార్జున, రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్లో వస్తున్న మన్మథుడు2 ఆగష్ట్ 9 వ తేదీన విడుదలవుతోంది. ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ షో షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో "బంగార్రాజు" సినిమాలో నటించబోతున్నాడు. మన్మథుడు 2 సినిమాలో పెళ్ళి వయసు దాటినా పెళ్ళి కాని పాత్రలో నాగార్జున నటిస్తున్నాడు. నాగార్జునకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: