కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 తొలివారం పూర్తైంది. అయితే వారాంతం వచ్చిందంటే కంటెస్టెంట్ గుండెల్లో గుబులు మొదలౌతోంది. బిగ్బాస్ ప్రారంభమైన వారం రోజులకే ఇంట్లో సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు, అభిప్రాయ బేధాలు పొడసూపాయి. ఈ క్రమంలో హోస్ట్గా నాగార్జునకు ఈ వారం భారీగానే పనిపెట్టినట్టు కనిపిస్తున్నాడు. ఉత్కంఠగా నడుస్తున్న బిగ్బాస్ శని, ఆదివారం నాగార్జున రావడంతో మరింత బుల్లితెర ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతోంది.
తొలివారంలోనే హేమ, రాహుల్, శ్రీముఖి, వరుణ్ సందేశ్, మహేష్ విట్ట మధ్య భారీగా గొడవులు జరిగాయి. మహేష్, వరుణ్ సందేశ్ మధ్య గొడవ కొట్టుకొనేంత వరకు వెళ్లింది. ఈ క్రమంలో బిగ్బాస్ తరుఫున హోస్ట్ నాగార్జున ఎలాంటి క్లాస్ పీకుతారో వేచి చూడాల్సింది. అలాగే ఇంట్లోంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్లు మొదట వారి ఛానెల్కే ఇంటర్వ్యూ ఇవ్వాలన్న నిబంధనను చేర్చారని.. తనీష్తో ఈ ఇంటర్వ్యూలు చేయించనున్నట్లు తెలుస్తోంది.
ఇక తొలి వారం ఎలిమినేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే.. 15 మందిలో మొత్తం ఆరుగుగు రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమలు తొలివారం ఎలిమినేషన్కి నామినేట్ అయ్యారు. తొలి వారం రోజులు సభ్యుల మధ్య గొడవలతో అన్ని ఎపిసోడ్లు బాగానే రక్తి కట్టాయి. ఇక ఇప్పుడు అందరూ వీకెండ్ ఎపిసోడ్ కోసమే ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. ఎవరు తొలి ఎలిమినేటర్ అన్నదే ఆసక్తిగా మారింది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జాఫర్, పునర్నవి సేఫ్ అవుతారని హేమ బయటకు వెళ్లిపోతారని ప్రచారం జరుగుతోంది. ఏదేమైన ఈ ఆరుగురిలో ఎవరు బయటకు వెళ్తారు అనే విషయంపై ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ఎంత వరకు నిజం అవుతుందో ఆదివారం తేలిపోనుంది.