కియారా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్నది.  ఈ హీరోయిన్ కు అనేక ఆఫర్లు వస్తున్నాయి.  ఫగ్లీ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ... ఎంఎస్ ధోని సినిమాతో మరో స్థాయికి వెళ్ళింది.  ఆ తరువాత తెలుగులో మహేష్ తో భరత్ అనే నేను, అనంతరం.. రామ్ చరణ తో వినయ విధేయ రామ సినిమాలు చేసి మెప్పించింది.  


వినయ విధేయ రామ ఫెయిల్ తరువాత ఈ అమ్మడు టాలీవుడ్ నుంచి తిరిగి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది.  తెలుగులో సూపర్ హిట్టైన అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ లో సందీప్ రెడ్డి వంగ కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశారు.  అందులో కియారా హీరోయిన్.  మాములుగా చేయాల్సిన దానికంటే ఈ అమ్మడురెండాకులు ఎక్కువే చేసింది.  


తన అందచందాలతో ఆకట్టుకోవడమే కాకుండా... ముద్దులకు ఏ మాత్రం అడ్డు చెప్పలేదు.  వావ్ అనిపించే విధంగా ముద్దులు పెట్టింది.  ము ము ము ముద్దంటే ఎవరికీ చేదు చెప్పండి.  అందుకే ముద్దులతో సినిమా ఎక్కడికో తీసుకెళ్లింది.  అనుకున్న దానికంటే సినిమా భారీ విజయం సాధించింది.  దాదాపుగా 300 కోట్ల రూపాయలు వసూలు చేసే దిశగా సాగిపోతున్నది.  


ఇదిలా ఉంటె, ఈ అమ్మడు చిన్నప్పుడు స్కూల్ స్టేజీలోనే కొన్ని ప్రేమ పాఠాలు చదివిందట.  ఈ విషయాన్ని కియారనే స్వయంగా వెల్లడించింది.  పదోతరగతి చదివే రోజుల్లో కియారా తనకు ఓ ఫ్రెండ్ ఉండేవాడట. అతను తనకు క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పింది.  పరీక్షల సమయంలో ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతుండగా అమ్మ చూసి మందలించిందని చెప్పింది.  అప్పటి నుంచి మాట్లాడటం మానేసి చదువుపై దృష్టిపెట్టినట్టు కియారా చెప్పుకొచ్చింది.  


ఈ సినిమా హిట్టయ్యాక కియారా చేతిలో మరో రెండు పెద్ద ప్రాజెక్టులు వచ్చాయి. ఆ రెండు కూడా కరణ్ జోహార్ ప్రాజెక్టులే అని తెలుస్తోంది.  ఈ రెండు సెట్స్ మీదకు వెళ్లి.. సినిమా హిట్టయితే బాలీవుడ్ లో కియారా సెటిల్ కావడం ఖాయం అని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: