టెంపర్ తరువాత  పూరి జగన్నాథ్ తీసిన  6 సినిమాలు  డిజాస్టర్లు అయ్యాయి. దాంతో  స్టార్ హీరోలు ఎవరు పూరి కి అవకాశం ఇవ్వలేదు. ఈక్రమంలో చాలా రోజులు వెయిట్ చేసిన పూరి ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు కథ చెప్పి ఒప్పించాడు. అదే ఇస్మార్ట్ శంకర్. రామ్ , పూరి కాంబో అనగానే సినిమా కు మంచి హైప్ వచ్చింది. ఫుల్  స్పీడ్ లో షూటింగ్ కంప్లీట్ చేసి   టీజర్ తో ఆ హైప్ ను కంటిన్యూ చేసిన పూరి  ట్రైలర్ కు అనుకున్నంతగా రెస్పాన్స్ తీసుకరాలేకపోయాడు.  దాంతో విడుదలకు ముందు ఈ సినిమా కూడా హిట్ అవ్వడం కష్టమే అనే వాదనలు వినిపించాయి. 


ఈనెల 18న సోలో గా విడుదలైన ఈ చిత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 12 రోజుల్లో 32 కోట్ల షేర్ వసూలు చేసి  బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని అందుకుంది. నిన్న బోనాలు  సందర్భంగా సెలవు దినం కావడం తో దాదాపు థియేటర్లు అన్ని హౌస్ ఫుల్ అయ్యాయి.  ఫుల్ రన్ ఈ చిత్రంలో  మరో 2 కోట్ల వసూళ్లు రాబట్టే అవకాశాలు వున్నాయి. 


ఇక రామ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఇస్మార్ట్ శంకర్  రికార్డు క్రియేట్ చేసింది.  పక్క మాస్ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాబా నటేష్ , నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా మణిశర్మ  సంగీతం అందించారు.పూరి కనెక్ట్స్ బ్యానర్ ఫై ఛార్మి ,పూరి సంయుక్తంగా  ఈ చిత్రాన్ని నిర్మించారు.  ఇక ఈ ఇస్మార్ట్ శంకర్ బ్లాక్  బ్లాస్టర్ కావడంతో  దీనికి  సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అనే చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు పూరి జగన్నాథ్. 



మరింత సమాచారం తెలుసుకోండి: