నాగార్జున మన్మధుడు 2 సినిమా ఆగస్టు 9 వ తేదీన రిలీజ్ కు సిద్ధం అవుతున్నది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 16 ఏళ్ల క్రితం వచ్చిన మన్మధుడు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తీస్తున్నారు. అది క్లీన్ ఎంటర్టైన్మెంట్ అయితే, ఇప్పుడు వస్తున్న ఈ మన్మధుడు 2 పక్కా రొమాంటిక్ ఎంటర్టైనర్. సినిమా ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఆసక్తి పెరిగింది.
అయితే, వేడుకను ఇంకా నిర్వహించలేదు. పాటలు ఎలా ఉంటాయో ఇంకా తెలియలేదు. మరో రెండు మూడు రోజుల్లో ఆడియో వేడుకను నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను పూర్తి చేసుకుంది. శాటిలైట్, డిజిటల్ ఇతర మాధ్యమాల రూపంలో 22 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడు పోయింది. ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో మరో 20 కోట్ల వరకు బిజినెస్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటె, ఈ సినిమా బడ్జెట్ గురించిన కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. ఈ సినిమాకోసం దాదాపుగా నిర్మాతలు 24 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. నాగార్జున రెమ్యునరేషన్ కాకుండా సినిమాకైనా బడ్జెట్ ఇది. ఈ సినిమా నిర్మాణంలో నాగార్జున కూడా ఉన్నారు. మనం ఎంటర్టైన్మెంట్ ద్వారా సినిమాను నిర్మిస్తున్నారు. దీంతో పాటు ఆనంది ఆర్ట్స్, వయాకామ్ 18 సంస్థలు ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకుంటున్నాయి.
రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా చేస్తున్నది. రకుల్ తో పాటు సమంత, కీర్తి సురేష్ లు కీలక పాత్రలు చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ లో సమంత, కీర్తి సురేష్ ల గురించి చూపించకపోవడం విశేషం. ఈ ఇద్దరి పాత్ర ఏంటి.. ఏ సందర్భంలో వీరు కనిపిస్తారు అన్నది తెలియాలి. రెండు పాత్రలను సస్పెన్స్ లో పెట్టడంతో.. సినిమాకు హైప్ క్రియేట్ అయ్యింది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే ఆగష్టు 9 వ తేదీ వరకు ఆగాల్సిందే.