రెబల్ స్టార్ కృష్ణంరాజు తన నట వారసుడుగా ప్రభాస్ ను ఆకాశంలోకి ఎత్తేస్తూ అనేకసార్లు ప్రశంసలు కురిపించాడు. ఈమధ్య జరిగిన భారతీయ జనతా పార్టీ నేతల సమావేశంలో ప్రభాస్ అభిమానులు అందర్నీ బిజేపీలో చేరవలసినదిగా ఓపెన్ గానే పిలుపు ఇచ్చాడు. ఇలాంటి సాన్నిహిత్యం ఉన్న వీరిద్దరి మధ్య జరిగిన ఒకచిన్న పొరపాటు కృష్ణంరాజుకు బాగా ఆర్ధిక నష్టం కలిగించింది అంటూ ఒక న్యూస్ ఛానల్ నిన్నరాత్రి ఒక ఆసక్తికర న్యూస్ ను ప్రసారం చేసింది. 

ప్రభాస్ ‘సాహో’ లో నటిస్తూనే కృష్ణంరాజు సొంత నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్ నిర్మిస్తున్న ఒక భారీ బడ్జెట్ మూవీలో నటిస్తున్నాడు. జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీ 1970 కాలంనాటి ప్రేమకథ. ఈమూవీ తొలి షెడ్యూల్ ఇటలీలో అదేవిధంగా హైదరాబాద్ లో కూడ పూర్తి చేసుకుంది. ఈమూవీకి సంబంధించిన షూటింగ్ 25 శాతం వరకు పూర్తి అయిన తరువాత ప్రభాస్ ఈమూవీ షూటింగ్ కు పూర్తిగా స్వస్తి పలికి తనదృష్టి అంతా ‘సాహో’ పై పెట్టేసాడు. 

దీనితో గత ఆరు నెలలుగా ఈమూవీకి సంబంధించి ఒక్క సీన్ కూడ చిత్రీకరణ జరుపుకోలేదు. దీనికితోడు ఇప్పటివరకు షూట్ చేసిన ఈమూవీకి సంబంధించిన రషస్ చూసిన కృష్ణంరాజుకు ఒక ఊహించని షాక్ తగిలినట్లు టాక్. ఇప్పటి వరకు తీసిన ఈమూవీ సీన్స్ లో కేవలం ఐదు శాతం మాత్రమే పనికి వస్తాయని మిగతాది అంతా ఏమాత్రం బాగాలేదు అంటూ కృష్ణంరాజు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. దీనితో ఇప్పటి వరకు షూట్ చేసిన సీన్స్ ను మళ్ళీ రీ షూట్ చేయాలని కృష్ణంరాజు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికే ఈమూవీ ఫస్ట్ షెడ్యూల్ పై చాలభారీగా ఖర్చుపెట్టిన నేపధ్యంలో తిరిగి మళ్ళీ రీ షూట్ అంటే ఖర్చుతో పాటు ఆలస్యం కూడ అవుతుందని ఈవిషయమై ప్రభాస్ అభిప్రాయాలు తెలుసుకుందామని కృష్ణంరాజు ప్రయత్నిస్తున్నా ‘సాహో’ బిజీతో ప్రభాస్ నుండి ఎటువంటి స్పందనా లేదని టాక్. దీనితో ‘సాహో’ ఫలితంలో తేడా వస్తే ప్రభాస్ ఆలోచనలు మారి జిల్ రాథాకృష్ణ సినిమాను ముందుకు తీసుకు వెళతాడా లేదా పూర్తిగా అటక ఎక్కిస్తాడా అన్న టెన్షన్ లో కృష్ణంరాజు ఉన్నట్లు ఆ ప్రముఖ ఛానల్ తన ఫిలిం న్యూస్ లో పేర్కొంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: