ఫగ్లీ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ.. తన సెకండ్ సినిమా ఎంఎస్ ధోనితో ఫేమస్ అయ్యింది. అదే సమయంలో నెట్ ఫ్లిక్స్ నుంచి ఆమె నటించిన లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ కావడంతో అవకాశాలు వచ్చాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమాలో నటించి కియారా అద్వాని తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ హాట్ అందాలను ఆరబోస్తు కుర్రకారును మతి చెడగొడుతున్న ఈ భామ టాలీవుడ్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచిన ‘అర్జున్ రెడ్డి’ చిత్ర రీమేక్గా సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన కబీర్ సింగ్ సినిమాలో హీరోయిన్గా నటించిన దేశవ్యాప్తంగా సూపర్ పాపులర్ హీరోయిన్గా మారిపోయింది. ఈ సినిమాలో కియారా నటనకు కుర్రకారు తెగ ఫిదా అవుతున్నారు. ఇంకా చెప్పాలంటే కియారా కోసమే పదే పదే సినిమా చూడడంతో రూ.250 కోట్ల షేర్ కొల్లగొట్టింది.
ఇక ఇటీవల కియరా తాజాగా హలో మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఇచ్చిన ఫోజు ప్రస్తుతం జోరుగా వైరల్ అవుతోంది.ఈ ఫోటోలో కియారా తన స్పెషల్ ఎట్రాక్షన్గా అందరి మనసులు దోచుకుంది. హలో ఇండియా ఆగస్టు కవర్ పేజీ కోసం బాలీవుడ్ టాప్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కియరా కోసం ఈ డిజైన్ రూపొందించారు. బ్లాక్ స్ట్రాప్ లెస్ టాప్ .. బ్లాక్ బాటమ్ .. కాంబినేషన్ గా క్రిస్టల్ నెక్లో కనిపించిన ఈ బ్యూటీ క్రేజీగా వైరల్ అవుతుంది.
నిజానికి ఏ కొత్త ఫ్యాషన్ వచ్చినా కియారాను ఫాలో అవ్వాల్సిందే.ఎప్పటికప్పుడు ఫోటో షూటులు చేస్తూ వాటిని షేర్ చేస్తూ సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తుంటుంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే భేధం లేకుండా అన్నిచోట్లా తనకు అభిమానులను పెంచుకుంటూ పోతుంది. ఇక తాజాగా వచ్చిన మ్యాగజైన్ కవర్ పేజీలో కియారా యూత్ చూపు పక్కకు తిప్పుకోకుండా చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో వరుసగా నటిస్తోంది.