ఫగ్లీ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కియారా అద్వానీ.. ఆ సినిమాలో గ్లామర్ తో ఆకట్టుకోవడంతో.. ధోని బయోపిక్ ఎం ఎస్ ధోని సినిమాలో అఫర్ లభించింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఆమె ద్రుష్టి టాలీవుడ్ పై పడింది. టాలీవుడ్లో మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమా చేసి మెప్పించింది. ఈ మూవీ హిట్ కావడం.. నెక్స్ట్ సినిమా వినయ విధేయ రామ సినిమా ప్లాప్ కావడంతో తిరిగి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది.
బాలీవుడ్ కు వెళ్లిన వెంటనే ఈ అమ్మడు కబీర్ సింగ్ చేసింది. ఎవరూ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది ఈ మూవీ. ఏకంగా రూ. 300 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమా విజయంలో కియారా కీలకపాత్ర పోషించింది అనడంలో సందేహం లేదు. అర్జున్ రీమేక్ గా వచ్చినా.. కబీర్ సింగ్ లో తెలుగుకు మించి ముద్దుల ఇందులో ఉన్నాయి. ఒకటికాదు రెండు కాదు పదుల సంఖ్యలో ముద్దులు ఉండటం సినిమాకు ప్లస్ అయ్యింది.
ఈ సినిమా విజయం తరువాత కియారాకు కరణ్ జోహార్ తో సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. రెండు సినిమాలు చేస్తున్నది. దీంతో పాటు ఈ లస్ట్ స్టోరీస్ బ్యూటీ సోషల్ మీడియాలో కిరాక్ అనిపించే ఫోటోలను షేర్ చేస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పటికే ఆమె ఇంస్టాగ్రామ్ లో వందలాది ఫోటోలు దర్శనం ఇస్తుంటాయి.
ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారి సంఖ్య భారీగా ఉన్నది. ఇటీవలే కియారా హలో మ్యాగజైన్ కు ఫోజులు ఇచ్చింది. పక్కా గ్లామర్ గా ఉండే నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లిన తరువాత మరలా ఈ హీరోయిన్ టాలీవుడ్ లో నటిస్తుందా లేదా అన్నది తెలియాలి. కబీర్ సింగ్ తరువాత ఈ అమ్మడు తన రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచినట్టు సమాచారం.