ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా   విడుదలై  బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సాధించాయి  'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ , బ్రోచేవారెవరురా'. ఇందులో మొదటగా  ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ  జూన్ 21 న విడుదలై అద్భుతమైన రివ్యూస్ , మౌత్ టాక్  తో  బాక్సాఫిస్ వద్ద సూపర్ కలెక్షన్స్ ను రాబట్టింది. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి టైటిల్ రోల్ లో నటించగా  ఆయనకు జోడిగా శృతి శెట్టి కనిపించింది.  కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నవీన్ నటన మేజర్ హై లైట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా అటు ఓవర్సీస్ లో కూడా కాసుల వర్షం కురిపించింది.  నూతన దర్శకుడు స్వరూప్ తెరకెక్కించిన  ఈసినిమా  ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో  విడుదలకానుంది.  ఆగస్టు 7న ఈ చిత్రం ప్రైమ్ లోకి  రానుంది.


ఇక రొమాంటిక్  సూపర్ హిట్ మూవీ 'మెంటల్ మదిలో'  తరువాత  ట్యాలెంటెడ్  హీరో శ్రీ విష్ణు , వివేక్ ఆత్రేయ కాంభినేషన్ లో  తెరకెక్కిన  చిత్రం 'బ్రోచేవారెవరురా'.   జూన్ 28న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో  బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టి  బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయ్యింది.  క్రైమ్ కామెడీ  నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో  శ్రీ విష్ణు సరసన నివేత థామస్ , నివేత పేతురాజ్ కథానాయికలుగా నటించగా  ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ, సత్య దేవ్  ముఖ్య పాత్రల్లో నటించారు. ఈచిత్రం కూడా ఓవర్సీస్ ప్రేక్షకులను  విపరీతంగా ఆకట్టుకుంది.  ఫలితంగా యూఎస్ బాక్సాఫీస్ వద్ద  మంచి వసూళ్లను రాబట్టి అక్కడ కూడా బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సాధించింది. ఇక ఈ చిత్రం కూడా అమెజాన్ ప్రైమ్ లోకి విడుదలకానుంది.  ఆగస్టు 9న ఈ చిత్రం ప్రైమ్ లోకి రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: