ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో కార్తికేయ. ఈ సినిమా ద్వారా అతనికి మంచి గుర్తింపు లభించింది. అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. అయితే మొన్న వచ్చిన "హిప్పీ" నిరాశ పరిచినా మళ్ళీ గుణ 369 తో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమా శుక్రవారం విడుదలయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సక్సెస్ ను మీడియాతో పంచుకున్నారు.


ఈ సందర్భంగా హీరో కార్తికేయ తల్లి మాట్లాడుతూ, మా అబ్బాయి ఇప్పటి వరకు మూడు సినిమాల్లో నటించిన ఇప్పటి వరకు ఎలాంటి ఫంక్షన్ కి రాలేదు. గుణ 369 సినిమా మాకు బాగా నచ్చింది. కార్తికేయ సినిమాల్లోకి వెళ్తా అంటే వద్దని వారించాము. ఎందుకు వెళ్ళాడా అని బాధపడ్డాం. కానీ గుణ 369 సినిమా చూశాక మాకు చాలా ఆనందంగా ఉంది. కార్తికేయ బాగా  నటించాడని వాడిని చూస్తుంటే గర్వంగా ఉంది అని చెప్పారు.


హీరో కార్తికేయ మాట్లాడుతూ, ఇప్పటి వరకు నన్ను అందరూ  ఆర్ ఎక్స్ 100 హీరో అంటున్నారు. ఇక నుండి గుణ 369 అని పిలుస్తారని అన్నాడు. డైరెక్టర్ అర్జున్ గుణ క్యారెక్టర్ ని చాలా బాగా డిజైన్ చేసాడు. ఆ పాత్రకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది.మహిళలు, అమ్మాయిలకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. నా కెరీర్లో ఆర్ ఎక్స్ 100 తర్వాత మరో గుర్తుండిపోయే సినిమా అని అన్నారు.


మంచి సందేశంతో వచ్చిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం కొంచెం డల్ గా ఉన్నాయని సమాచారం. మరి సినిమాకి వచ్చిన టాక్ తో కలెక్షన్లు పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రముఖ దర్శకుడు బోయపాటి శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ సినిమాని జ్ఞాపిక ప్రొడక్షన్స్, స్రింట్ ఫిల్మ్స్ ద్వారా అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి, ప్రవీణ కడియాల సంయుక్తంగా నిర్మించారు.




మరింత సమాచారం తెలుసుకోండి: