గతవారం విడుదలైన ‘డియర్ కామ్రేడ్’ ప్రమోషన్ విషయంలో విజయ్ దేవరకొండ ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోయింది. ఈమూవీకి వచ్చిన డివైడ్ టాక్ తో ఈమూవీ కలక్షన్స్ భారీగా పడిపోవడంతో ఈమూవీ బయ్యర్లకు విపరీతమైన నష్టాలు రాబోతున్నాయి. 

ఇలాంటి పరిస్థితులలో ఎలర్ట్ అయిన విజయ్ దేవరకొండ పిఆర్ టీమ్ ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి ఇస్తున్న లీకులు వ్యవహారం చాలామందికి నవ్వును తెప్పిస్తోంది. ‘డియర్ కామ్రేడ్’ మూవీ విడుదల కాకుండానే ఈమూవీ బాలీవుడ్ రీమేక్ రైట్స్ ను కరణ్ జోహార్ 6 కోట్ల రూపాయలకు కొనుక్కోవడం అత్యంత సంచలనంగా మారింది. 

ఇప్పుడు ఈమూవీ ఫ్లాప్ గా మారడంతో ఈ ఫెయిల్యూర్ మూవీ రీమేక్ లో ఏ బాలీవుడ్ హీరో నటిస్తాడు అన్న ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఇది ఇలా కొనసాగుతూ ఉంటే ఈ విషయానికి విజయ్ పిఆర్ టీమ్ ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ‘డియర్ కామ్రేడ్’ మూవీ బాలీవుడ్ రీమేక్ లో కరణ్ జోహార్ విజయ్ ను నటించమని అడగడమే కాకుండా 40 కోట్ల పారితోషికం ఆఫర్ చేసారు అంటూ షాకింగ్ వార్తలను ప్రచారంలోకి తీసుకువస్తున్నారు. 

అయితే విజయ్ తనకు ఇప్పట్లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే ఉద్దేశ్యం లేదు అంటూ చెప్పడంతో ఆ ఆఫర్ ముందుకు సాగలేదు అని విజయ్ పిఆర్ టీమ్ వ్యూహాత్మక లీకులు ఇస్తున్నారు. దీనితో ‘డియర్ కామ్రేడ్’ ఫెయిల్ అయినా విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పడానికి విజయ్ పిఆర్ టీమ్ మరీ ఇంత నమ్మలేని విషయాలను ప్రచారంలోకి తీసుకు వస్తే ఎవరు నమ్ముతారు అంటూ ఇండస్ట్రీలో కొందరు జోక్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండకు ఇలాంటి ఆఫర్ కరణ్ జోహార్ ఇచ్చాడు అంటూ ప్రచారం చేసే రోజులు కూడ ముందు ఉన్నాయి అంటూ మరికొందరు జోక్స్ వేసుకుంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: