మల్టీస్టారర్ సినిమాలకు ఒకప్పుడు బాలీవుడ్ మాత్రమే కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. ప్రస్తుతం ఆ స్థానాన్ని టాలీవుడ్ ఆక్రమించేస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో రామ్ చరణ్-ఎన్టీఆర్ మల్టీస్టారర్ తరువాత ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మల్టీస్టారర్ సినిమా వెంకీ మామ. నిజ జీవితంలో మామా అల్లుళ్లయిన విక్టరీ వెంకటేశ్ – నాగ చైతన్య లు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

 

సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా గురించి సినీ అభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. వెంకటేశ్ టాలీవుడ్ స్టార్ హీరో. నాగ చైతన్య మీడియం రేంజ్ హీరోల్లో స్టార్. ఒకే కుటుంబం నుంచి రావడంతో వీరి సినిమాకు హైప్ వచ్చింది. ఈ సినిమా దర్శకుడు బాబీ పుట్టినరోజు సందర్భంగా 28 సెకన్ల మైక్రో టీజర్ వదిలారు మేకర్స్. “దగ్గుబాటి మామ – అక్కినేని అల్లుడు.. మొదటి సారి కలిసి వస్తున్నారు” అంటూ టీజర్ లో సందడి రేపారు. పల్లెటూళ్లో ఉండే సందడిని ఇద్దరూ హీరోలు తమ నడక, స్టైల్ తో చూపించారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకటేశ్ సరసన పాయల్ రాజ్ పుత్, నాగచైతన్య సరసన రాశీ ఖన్నా నటిస్తోంది.

 

మామా అల్లుళ్లిద్దరూ 2016లో వచ్చిన ప్రేమమ్ ఓ ఫ్రేమ్ లో కనిపించి సందడి చేశారు. ఆ మాత్రం దానికే ఆడియన్స్ నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. ఇక ఫుల్ లెంగ్త్ సినిమా చేస్తే తెర మీద కనువిందు ఖాయమే. ఈ సినిమా టీజర్ ఆగస్టులోనే రానుంది. సినిమా బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసి అక్టోబర్ లో రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మామా అల్లుళ్ల సందడి యూ ట్యూబ్ టాప్ ట్రెండింగ్ లో ఆరో స్థానంలో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: