అల్లు అర్జున్ ఏ ఏ 19 వ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. సినిమాను సంక్రాంతికి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతికి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అటు మహేష్ బాబు సినిమా కూడా సంక్రాంతికి సిద్ధం అవుతున్నది. ఈ ఇద్దరి కంటే ముందే సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ దర్బార్ సంక్రాంతికి వస్తున్నట్టు ముందుగానే ప్రకటించారు. సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకోబోతున్నది.
మురుగదాస్ సినిమా కాబట్టి సినిమా ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. పైగా రజినీకాంత్ 25 ఏళ్ల తరువాత తిరిగి పోలీస్ అధికారిగా చేస్తున్నాడు. ఇది సినిమాకు ప్లస్ అయ్యింది. మహేష్ బాబు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ఇప్పటికే ప్రకటించారు. దీంతో బన్నీ ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. సినిమాను భారీ పోటీ మధ్య నిలబెట్టి రిస్క్ తీసుకునే బదులుగా సింగిల్ గా వస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాడట.
ఈ దిశగా యూనిట్ ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. పైగా మెగాస్టార్ సైరా సినిమా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఆలస్యం జరిగేలా ఉన్నది. ఆలస్యం జరిగితే.. సినిమాను అక్టోబర్ నుంచి సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఆప్షన్ గా పెట్టుకున్నారు. సైరా సంక్రాంతికి వస్తుంటే.. మరో మెగా మూవీ అప్పుడు రిలీజ్ అయ్యేందుకు ఇష్టపడరు. కాబట్టి వెనక్కి వెళ్లొచ్చు.
ప్రస్తుతం షూటింగ్ వేగంగానే జరుగుతున్నది. సినిమా రిలీజ్ వాయిదా పడినా అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ చేసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని యూనిట్ అనుకుంటోంది. ఎందుకంటే బన్నీ ఇప్పటికే హిట్ రేస్ లో వెనకబడి ఉన్నాడు. మంచి హిట్ అందుకొని చాలాకాలం అయ్యింది. హిట్ కొడితేనే మరలా స్టార్ ఇమేజ్ సంపాదించుకోగలుగుతాడు.
అందుకే ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇలాంటి సమయంలో రిస్క్ తీసుకొని భారీ పోటీ మధ్య సినిమాను నిలిపి... టెన్షన్ పడటం ఎందుకని బన్నీ ఆలోచన. మరి చూద్దాం ఏం జరుగుతుందో. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. అక్కినేని హీరో సుశాంత్ కీలక పాత్ర చేస్తున్నారు.