సంక్రాంతి పండగ స్టార్ట్ అయిందంటే చాలా థియేటర్ల వద్ద సినిమా సందడి మొదలవుతుంది. నిజానికి హిట్ కొడితే సంక్రాంతికి కొట్టాలని చాలా మంది అనుకుంటారు. ప్రేక్షకుల్లో పండగ వాతావరణంతో పాటు కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు కొత్త సినిమాలు విడుదల చేసి భారీ కలెక్షన్లు పొందుతారు. అయితే ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోటీ ఓ రేంజ్లో నెలకొంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా సంక్రాంతికి లాక్ చేశారు.
మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కూడా సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే ముందు ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అలరిస్తాయని అందరూ అనుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ 'దర్బార్' సినిమా కూడా సంక్రాంతి కానుకగా థియేటర్స్ కి రానుంది ప్రకటించింది. అలాగే `సైరా` దసరా కాకనుకగా వస్తుందనుకుంటే గ్రాఫిక్స్ కారణంగా ఆ సినిమా కూడా పోస్ట్ పోన్ అవుతుందని అంటున్నారు. మరి సైరా దసరాకు రాకపోతే ఖచ్చితంగా సంక్రాంతికి మాత్రమే విడదల కావాల్సి ఉంది.
మరి ఇంత టఫ్ ఫైట్ మధ్య బన్నీ తన సినిమాను ఫిబ్రవరికి వాయిదా వేయాలని చూస్తున్నాడట. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా రజనీకాంత్ 'దర్బార్స సినిమా మాత్రం సంక్రాంతికి ఖచ్చితంగా రిలీజ్ చేస్తారని అంటున్నారు. బన్నీ సోలోగా వచ్చి భారీ వసూళ్లు కొల్లగొట్టాలని చూస్తున్నాడట. నిజానికి టాప్ హీరోల సినిమాల రిలీజ్ డేట్లు ఎప్పటికప్పుడు తారుమారు అవ్వడం సహజం అయిపోయింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ టఫ్ ఫైట్ మధ్య సంక్రాంతికి రావడం కంటే ఆ తర్వాత సోలోగా వచ్చి భారీ కలెక్షన్స్ కొల్లకొట్టొచ్చన్నదే ప్లాన్గా తెలుస్తోంది.
గతంలో కూడా అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేష్లో వచ్చిన s\o సత్యమూర్తి సినిమా కూడా ఫిబ్రవరిలోనే రిలీజ్ అయింది. ఇదే క్రమంలో ఇప్పుడు ఈ సినిమా కూడా ఫిబ్రవరిలో విడుదల చేయాలనుకుంటున్నారని టాక్. ఇక మరి 2020 సంక్రాంతిలో బాక్సాఫీస్ జరిగే టఫ్ వార్లో ఎవరు ముందు ఉంటారో చూడాల్సి ఉంది.