ఒకప్పుడు టాలీవుడ్ను ఓ రేంజ్లో ఏలిసిన ఓ నలుగురు హీరోలు ఇప్పుడు మళ్లీ అదే ఫుల్ ఫామ్తో యంగ్ హీరోలకు పోటీగా వస్తున్నారు. టాలీవుడ్కు బలమైన పిల్లర్స్గా నిలిచిన వెంకటేష్-నాగార్జున-బాలకృష్ణ-చిరంజీవి మంచి స్పీడ్లో ఉండేవారు. 1980 నుంచి 2000 వ దశకం వరకు వీరిదే డామినేషన్. వీరంతా ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పరుచుకున్నారు.
ఆ తర్వాత ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్చరణ్ ఇలా యంగ్ హీరోల రాకతో వీళ్లు సీనియర్ హీరోలుగా కొంచెం స్పీడ్ తగ్గించారు. అయితే ఇప్పుడు అదే జోష్తో మళ్లీ రీ బ్యాక్ అవుతున్నారు. కుర్ర హీరోలను ఢీ కొడుతూ మళ్లీ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. అయితే మళ్లీ అదే జోష్తో వస్తున్న ఈ సీనియర్ హీరోలు వయసుతో సంబంధం లేకుండా మంచి సినిమాలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మల్టీస్టారర్ 'ఎఫ్ 2` సూపర్ డూపర్ హీట్ ఇవ్వడంతో వెంకటేష్ మళ్లీ ఫామ్లో పడ్డారు. ఇక తాజాగా మేనల్లుడు నాగచైతన్యతో కలిసి నటిస్తున్న సినిమా `వెంకీమామ` ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను దసరాకు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత వెంకీ మరో మూడు సినిమాలు లైన్లో పెట్టాడు.
అలాగే మరో సీనియర్ హీరో బాలకృష్ణ మాత్రం ఎప్పటికప్పుడు గ్యాప్ లేకుండా అదే ఫుల్ జోష్తో కొనసాగుతున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ల తర్వాత కే.ఎస్ రవికుమార్ దర్వకత్వంలో `రూలర్` అనే సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమా తర్వాత దిల్ రాజు నిర్మించే మరో సినిమాతో పాటు బోయపాటి సినిమాకు కమిట్ అవుతున్నాడు. ఇక నాగార్జున మాత్రం అదే రొమాంటిక్ లుక్ కంటిన్యూ చేస్తూ తాజాగా మన్మథుడు 2 సినిమాతో ఈ శుక్రువారం ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి విషయం చెప్పక్కర్లేదు.. ఖైదీ నెంబర్ 150తో మళ్లీ రీ బ్యాక్ అయిన చిరంజీవికి భారీ వసూళ్లు కొల్లగొట్టి మంచి హిట్ ఇచ్చింది. ఆ తర్వాత భారీ బడ్జెట్ సినిమా `సైరా` సినిమాతో బీజీగా ఉన్నారు. మరియు ఈ సినిమా తర్వాత కొరటాలకు కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేశారు. ఇలా ఈ సినియర్ హీరోలు రీ ఎంట్రీ ఇచ్చి వరుస పెట్టి సినిమాలు చేస్తు దూసుకుపోతున్నారు. మరి వీళ్లు ఎంత వరకు యంగ్ హీరోల ముందు నిలుస్తారో చూడాలి.