బాహుబ‌లి సిరీస్ త‌ర్వాత ఓ రేంజ్‌లో పాపుల‌ర్ అయిన ప్ర‌భాస్ నేష‌న‌ర‌ల్ వైడ్‌ స్టార్‌గా ఎదిగిపోయారు. అదే మార్కెట్ కంటిన్యూ చేయాల‌ని చూస్తున్న ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో మై ఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సాహోలో న‌టిస్తున్నాడు. శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా న‌టిస్తున్న సాహో బాలివుడ్ సినిమాల‌నే త‌ల‌ద‌న్నేలా రూ. 300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రం ఆగ‌స్టు 30న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కాబోతుంది. 


అయితే అన్నీ భాష‌ల్లోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్ర‌భాస్ మిగిలిన భాష‌ల‌ టాప్ హీరోల‌ను `సాహో` సినిమా భ‌య‌పెడుతున్నాడు. సహంజ‌గా త‌మిళ ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా ఇత‌ర భాష‌ల హీరోల‌ను ఇష్ట‌ప‌డ‌రు. అయితే ఇది ప్ర‌భాస్ విష‌యంలో పూర్తి యూ ట‌ర్న్ తీసుకుంది. బాహుబ‌లి సినిమాతో అన్ని భాష‌ల వారిని ఆక‌ట్టుకుని తిరుగులేని అభిమానం సంపాధించుకున్నారు ప్ర‌భాస్‌. అయితే ఇప్పుడు త‌మిళ స్టార్ హీరోలు సైతం  ప్ర‌భాస్ సాహోకు భ‌య‌ప‌డుతున్న‌ట్టు టాక్.


నిజానికి త‌మిళంలో మంచి క్రేజ్ తెచ్చుకున్న సూర్య ప్ర‌స్తుతం కేవీ ఆనంద్ దర్శకత్వంలో న‌టించిన సినిమా ‘కప్పమ్’. అయితే  సినిమాను తెలుగులో బందోబస్తు అనే టైటిల్‌తో ఆగ‌స్టు 30 విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స‌యేషా సైగ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. అయితే సాహో ఆగ‌ష్టు 30కి వాయిదా ప‌డ‌డంతో ప్ర‌భాస్‌తో పోటీ ప‌డ‌డం ఎందుక‌ని త‌న సినిమాను వాయిదా వేసుకోవాల‌ని సూర్య చూస్తున్నారు. 


త‌మిళంలో కూడా సాహోకు మంచి క్రేజ్ ఉండ‌డంతో సూర్య వెన‌క‌డుగు వేస్తున్నాడు. మ‌రి త్వ‌ర‌లోనే బందోబ‌స్తు సినిమా కొత్త డేట్ కూడా ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా ప్ర‌భాస్ దెబ్బ‌కు సూర్య లాంటి స్టార్ హీరోలే త‌మ సినిమాను వాయిదా వేసుకోవాల్సిన ప‌రిస్థితి.



మరింత సమాచారం తెలుసుకోండి: