రెబల్ స్టార్ ప్రభాస్  నటించిన   యాక్షన్ ఎంటర్టైనర్  'సాహో' షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ చిత్రం యొక్క ప్రమోషన్స్ ను కూడా స్టార్ చేశారు చిత్ర యూనిట్ . అందులో భాగంగా ఈ చిత్రం నుండి రోజుకో  అప్ డేట్ ఇస్తున్నారు.  కాగా ఇటీవల విడుదలైన టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా ఆగస్టు 15 న ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను కూడా విడుదల చేయనున్నారు.  ఇక ప్రభాస్ ఫ్యాన్స్  ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   ఈ ఈవెంట్ ను ఈనెల 18న రామోజీ ఫిలిం సిటీ లో గ్రాండ్ గా జరుపనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే  దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి వుంది.  మరి ఈ ఈవెంట్ కు  ముఖ్య అతిథి గా ఎవరు వస్తారో చూడాలి. 


  'రన్ రాజా రన్'  ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న  ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లో  శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించగా జాకీ ష్రాఫ్ , అరుణ్ విజయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.  కాగా ఈ చిత్రానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు పనిచేయగా ఒక్కో యాక్షన్ ఎపిసోడ్ ను భారీ ఖర్చు తో తెరకెక్కించారు. అలాగే ఇంతకుముందు ఎన్నడూ ఏ ఇండియన్ సినిమాలోని లేనన్నీ వి ఎఫ్ ఎక్స్  సన్నివేశాలు ఈ సినిమాలో కనిపించనున్నాయి . 


ఆగస్టు 30న   ప్రపంచ వ్యాప్తంగా  భారీ స్థాయిలో విడుదలకానున్న ఈచిత్రాన్ని  అత్యంత భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్  నిర్మిస్తుంది.  దాదాపు  2 ఏళ్ళ తరువాత ప్రభాస్ నటించిన సినిమా విడుదల అవుతుండడంతో ఈచిత్రంఫై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి ఈచిత్రం వారి అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: