'రన్ రాజా రన్' ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించగా జాకీ ష్రాఫ్ , అరుణ్ విజయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఈ చిత్రానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు పనిచేయగా ఒక్కో యాక్షన్ ఎపిసోడ్ ను భారీ ఖర్చు తో తెరకెక్కించారు. అలాగే ఇంతకుముందు ఎన్నడూ ఏ ఇండియన్ సినిమాలోని లేనన్నీ వి ఎఫ్ ఎక్స్ సన్నివేశాలు ఈ సినిమాలో కనిపించనున్నాయి .
ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకానున్న ఈచిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. దాదాపు 2 ఏళ్ళ తరువాత ప్రభాస్ నటించిన సినిమా విడుదల అవుతుండడంతో ఈచిత్రంఫై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి ఈచిత్రం వారి అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.