జూనియర్ ఎన్టీఆర్ కు ఇద్దరు కొడుకులు మాత్రమే ఉన్నా తన అభిమానులు అందర్నీ తన కుటుంబ సభ్యులుగా పరిగణిస్తూ ఉంటాడు. అందువల్లనే జూనియర్ సినిమాలకు సంబంధించిన ప్రతి ఫంక్షన్ లోను తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ ఫంక్షన్ పూర్తి అయిన తరువాత జాగ్రత్తగా ఇళ్ళకు వెళ్ళండి. మీ కోసం మీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారు అంటూ జాగ్రత్తలు చెపుతూ ఉంటాడు.

ఇప్పుడు అలాంటి జూనియర్ కు సంబంధించిన అభిమానుల ఫ్యామిలీ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. గత కొంత కాలంగా జూనియర్ సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉంటున్నాడు. అతడి ట్విటర్ అకౌంట్ లో ఇప్పటి వరకు జూనియర్ చేసిన ట్విట్స్ 273 మాత్రమే అయినా ప్రస్తుతం అతడికి ఫాలోయర్స్ 3.2 మిలియన్స్ సంఖ్యలో ఉన్నారు. 

2012 లో ఫేస్ బుక్ లోకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ కు అక్కడ కూడ అతడి పేజీని లైక్ చేస్తున్నవారి సంఖ్య ఏకంగా 3.1 మిలియన్ స్థాయికి పెరిగిపోయింది. ఈ నేపధ్యంలో తారక్ తన అభిమానులకు మరింత దగ్గర కావడానికి ఇన్ స్టా గ్రామ్ లో కూడ ఎకౌంట్ తెరిచాడు. తన ఇద్దరి కొడుకులతో కలిసి తీయించుకున్న ఫోటోతో ఈ అకౌంట్ ను తెరిచి ఇప్పటి వరకు కేవలం 14 పోస్టులు మాత్రమే పెట్టినా అతడి ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ కు అప్పుడే ఒక మిలియన్ ఫాలోయర్స్ వచ్చి చేరడం సంచలనంగా మారింది. 

దీనితో జూనియర్ అభిమానుల సమిష్టి కుటుంబం పెరిగిపోతోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అభిమానులే తనకు దేవుళ్ళు అంటూ తరుచూ జూనియర్ తన ఉపన్యాసాలలో చెప్పిన పరిస్థితులలో అభిమానులు ఈవిధంగా స్పందిస్తున్నారు అనుకోవాలి. ప్రస్థుతం జూనియర్ నటిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ సంచలన విజయం సాదిస్తే జూనియర్ కుటుంబ సభ్యుల సంఖ్య మరింత పెరిగే ఆస్కారం ఉంది..  
.


మరింత సమాచారం తెలుసుకోండి: