యువ హీరో శ్రీ విష్ణు తో  'నీది నాది ఒకే కథ'  అనే చిత్రాన్ని తెరకెక్కించి  విమర్శకుల ప్రశంసలు అందుకున్న యంగ్ డైరెక్టర్   వేణు ఊడుగుల  ప్రస్తుతం రానా , సాయి పల్లవి జంటగా 'విరాటపర్వం'  అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.   ఇటీవలే ఈ చిత్రం యొక్క ప్రారంభం కాగా  ప్రస్తుతం సాయి పల్లవి ఫై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.  తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో  పీరియాడికల్ లవ్ స్టోరీ మరియు పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో  సీనియర్ నటి టబు ను  ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు.


 తెలుగులో చాలా గ్యాప్ తరువాత టబు  ఈ సినిమా చేయడానికి  ఒప్పుకున్నారు. అయితే  ప్రస్తుతం   కొన్ని హిందీ సినిమాలకు కూడా సైన్ చేసిందట.  దాంతో విరాటపర్వం కు డేట్స్ కేటాయించలేకపోతున్నాని సినిమా నుండి తప్పుకుందట టబు. కాగా టబు ప్రస్తుతం అల్లు అర్జున్ 19వ చిత్రంలో కూడా నటిస్తుంది.   ఇక టబు విరాటపర్వం నుండి తప్పుకోవడం తో ఆ  పాత్రకు   నందిత దాస్ ను తీసుకున్నారట  మేకర్స్. త్వరలోనే ఆమె ఈ సినిమా  షూటింగ్ లో జాయిన్ కానుంది. ఈసినిమాలో నందిత దాస్ మానవ హక్కుల నేతగా నటించనుందట. 


ఇక  అలాగే  రానా  ఈ చిత్రంలో  పోలీస్ ఆఫీసర్ గా  నటించనుండగా  సాయి పల్లవి  వరంగల్ అమ్మాయి గా ,నక్సలైట్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం యొక్క షూటింగ్ వరంగల్ , సిద్దిపేట , కరీంనగర్ తదితర ప్రాంతాల్లో జరుగనుంది.  సురేష్ ప్రొడక్షన్స్ , ఎస్  ఎల్ వి సినిమాస్ బ్యానర్ల ఫై సురేష్ బాబు , చెరుకూరి సుధాకర్ సంయుక్తంగా  నిర్మిస్తున్న ఈ చిత్రం  ఈఏడాది చివర్లో విడుదలకానుంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: