దేవిశ్రీ టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అందులో సందేహం అవసరం లేదు. ఒకప్పుడు టాప్ మోస్ట్ ఆల్బమ్స్ ఇచ్చాడు. ఇండస్ట్రీలో ఇప్పటికి బెస్ట్ సాంగ్స్ అంటే దేవిశ్రీవి వినిపిస్తుంటాయి. అలాంటి దేవిశ్రీ గత కొంతకాలంగా ఒకే మోడ్లో సాంగ్స్ ఉంటున్నాయని అంటున్నారు. దేవి పని అయిపోయిందని అందరు అనుకుంటున్నారు.
దేవిశ్రీ పై ఎన్ని మాటలు వస్తున్నా.. మహేష్ మాత్రం దేవికి ఛాన్స్ ఇస్తున్నారు. భరత్ అనే నేను, మహర్షి రెండు సినిమాలు దేవీశ్రీ చేశాడు. ఈ సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో హిట్ కాంబినేషన్ను మార్చేందుకు సిద్ధంగా లేరు. అందుకే సరిలేరు నీకెవ్వరూ ఛాన్స్ కూడా దేవిశ్రీకి దక్కింది. మహర్షి సినిమాకు ఓ మోస్తరు సాంగ్స్ ఇచ్చాడు.
కానీ, సరిలేరు నీకెవ్వరూ మూవీకి జబర్దస్త్ సంగీతం ఇస్తానని హామీ ఇచ్చారు. కెరీర్లో బెస్ట్ సాంగ్స్ ఇస్తానని చెప్పిన దేవిశ్రీ.. మహేష్ పుట్టినరోజున ఇంట్రో సాంగ్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో మహేష్ బాబు ఆర్మీ గెటప్ లో కనిపించాడు. మేజర్ అజయ్ కృష్ణ ఇంట్రడక్షన్ ను చూపించారు.
సరిలేరు నీకెవ్వరూ.. నువ్వెళ్ళే దారికి జోహారూ అనే టైటిల్ తో కూడిన సాంగ్ ను ఇచ్చారు. గత దేవి సాంగ్స్ లాగానే.. ఈ సాంగ్ కూడా ఉందని కొంతమంది పెదవి విరుస్తున్నారు ఫ్యాన్స్. నెటిజన్లు కూడా దీనిపై ట్రోల్ చేస్తున్నారు. జస్ట్ ఇది ప్రోమోనే కాబట్టి అసలు సాంగ్స్ ఎలా ఉంటాయో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీలో విజయ శాంతి కీలక పాత్ర చేస్తున్నది. ఈ సినిమాలో ట్రైన్ సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయని సమాచారం. కొండారెడ్డి బురుజు సన్నివేశాలు సినిమాకు హైలైట్ అవుతాయట.