ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో నటించనున్న సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా  ఛాన్స్ కొట్టేసిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి . తొలుత  ఈ సినిమాలో రష్మిక, త్రిష లను  ను హీరోయిన్ గా తీసుకోవాలని భావించిన  మేకర్స్, ప్రస్తుతం కియారా అద్వానీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది .  హిందీలో కియారా అద్వానీ  నటించిన కబీర్  సింగ్ చిత్రం  హిట్ కావడంతో, బాలీవుడ్ లో ను అమ్మడుకు  అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి .


టాలీవుడ్ లో ఇప్పటికే అగ్ర హీరోలు మహేష్ బాబు , రామ్ చరణ్ సరసన నటించింది కియారా ... సూపర్ స్టార్ మహేష్ సరసన  నటించిన భరత్ అనే నేను సినిమా బాక్స్ అఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే  . ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ చిత్రం ఆశించిన స్థాయి లో విజయం సాధించలేదు . ఈ సినిమా లో నటిస్తుండగానే  హిందీ లో కబీర్ సింగ్ చిత్రానికి సైన్ చేసింది కియారా .


ఈ చిత్రం బాలీవుడ్ లో సూపర్ , డూపర్ హిట్ కావడం తో  పలు సినిమాల్లో కియారా కు అవకాశాలు దక్కాయి . ప్రస్తుతం గుడ్ న్యూస్ , లక్ష్మి బాంబ్ అనే హిందీ చిత్రాల్లో నటిస్తోంది . కోలీవుడ్ లో విజయ్ సరసన హీరోయిన్ గా నటించనున్న కియారా … ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే అటు బాలీవుడ్ తో పాటు , ఇటు దక్షిణాదిలోను అగ్ర హీరోయిన్ గా  పాగా వేయడం ఖాయమేనని సినీ విశ్లేషకులు అంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: