ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో నటించనున్న సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి . తొలుత ఈ సినిమాలో రష్మిక, త్రిష లను ను హీరోయిన్ గా తీసుకోవాలని భావించిన మేకర్స్, ప్రస్తుతం కియారా అద్వానీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది . హిందీలో కియారా అద్వానీ నటించిన కబీర్ సింగ్ చిత్రం హిట్ కావడంతో, బాలీవుడ్ లో ను అమ్మడుకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి .
టాలీవుడ్ లో ఇప్పటికే అగ్ర హీరోలు మహేష్ బాబు , రామ్ చరణ్ సరసన నటించింది కియారా ... సూపర్ స్టార్ మహేష్ సరసన నటించిన భరత్ అనే నేను సినిమా బాక్స్ అఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే . ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ చిత్రం ఆశించిన స్థాయి లో విజయం సాధించలేదు . ఈ సినిమా లో నటిస్తుండగానే హిందీ లో కబీర్ సింగ్ చిత్రానికి సైన్ చేసింది కియారా .
ఈ చిత్రం బాలీవుడ్ లో సూపర్ , డూపర్ హిట్ కావడం తో పలు సినిమాల్లో కియారా కు అవకాశాలు దక్కాయి . ప్రస్తుతం గుడ్ న్యూస్ , లక్ష్మి బాంబ్ అనే హిందీ చిత్రాల్లో నటిస్తోంది . కోలీవుడ్ లో విజయ్ సరసన హీరోయిన్ గా నటించనున్న కియారా … ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే అటు బాలీవుడ్ తో పాటు , ఇటు దక్షిణాదిలోను అగ్ర హీరోయిన్ గా పాగా వేయడం ఖాయమేనని సినీ విశ్లేషకులు అంటున్నారు .