హన్సిక మోత్వానీ.. తెలుగులో దేశముదురు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తెలుగులో చాలా సినిమాలు చేసింది. తెలుగులో అదృష్టం పెద్దగా కలిసి రాకపోవడంతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు అక్కడి నుంచి కోలీవుడ్ కు వెళ్ళింది. కోలీవుడ్ లో ఈ అమ్మడికి బాగా కలిసి వచ్చింది. అక్కడ వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నది.
ప్రస్తుతం కోలీవుడ్ లో ఓ హర్రర్ కామెడీ సినిమా చేయడానికి సిద్ధం అయ్యింది. గులేబకావళి, జాక్ పాట్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన కళ్యాణ్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఈ అమ్మడు రెడీ అయ్యింది. అది కూడా హర్రర్ కామెడీ సినిమా. ఇటీవల కాలంలో హర్రర్ కామెడీ సినిమాలకు మంచి డిమాండ్ ఉన్నది. వరసగా ఇలాంటి సినిమాలు వస్తున్నాయి.
ఈ సినిమాలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. కారణం ఏమంటే.. ఖర్చు తక్కువ. 90 % గ్యారెంటీ. కథ కథనాలు బాగున్నాయి అంటే పెట్టిన దానికి నాలుగు రెట్లు అధికంగా డబ్బు వస్తుంది. అందులో సందేహం అవసరం లేదు. అందుకే అలాంటి సినిమాలు చేయడానికి రెడీ అవుతుంటారు. ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేయడానికి ఆయా దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉంటున్నారు.
తెలుగులో సైతం ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. సినిమాల్లో కామెడీ ఉండటం షరా మామూలే. కాకపోతే.. అందులో హర్రర్ మిక్స్ కావడం హైలైట్. హర్రర్ సినిమాలు చేయాలి అనుకునే వాళ్ళు కాస్త కొత్తగా ఉండే కథను ఎంపిక చేసుకోవాలి. అలాంటి కథను ఎంపిక చేసుకున్నాకే సినిమాను ముందుకు తీసుకెళ్తుంటారు. మరి హన్సిక ఈ హర్రర్ కామెడీ సినిమాతో ఎంతమేరకు మెప్పిస్తుందో చూడాలి. మొన్నటి వరకు హర్రర్ కామెడీ సినిమాలను తమన్నా ఎక్కువ చేసింది. ఇప్పుడు ఆ జానర్ సినిమాలను హన్సిక మొదలుపెట్టింది.