కింగ్  నాగార్జున , 'చి ల సౌ' ఫేమ్  రాహుల్ రవీంద్రన్ కలయికలో  తెరకెక్కిన  చిత్రం మన్మథుడు 2 నిన్న విడుదలై దారుణమైన రేటింగ్స్ ను రాబట్టుకుంది.  వాటికీ తోడు  మౌత్ టాక్ కూడా  అలాగే వుంది. కాగా  ఈచిత్రం మొదటి రోజు 4.86 కోట్ల షేర్ ను రాబట్టింది.  అయితే  సూపర్ హిట్ సినిమా మన్మథుడు అనే టైటిల్  తో ఈ సినిమా వచ్చే సరికి  సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందేమో అనుకోని  మొదటి రోజు కు అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరుగాయి. అందుకే అంత దారుణమైన టాక్ తో కూడా  మొదటి రోజు డీసెంట్ వసూళ్లను  రాబట్టింది ఈ చిత్రం. కానీ రెండవ  రోజునుండి ఆలా ఉండదు మొత్తం సీన్ మారిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది కనీసం సినిమా యావరేజ్ గా వున్నా గట్టెక్కేదే కానీ  ఏ వర్గానికి కూడా సినిమా నచ్చకపోవడంతో బయ్యర్లకు భారీ నష్టాలు తప్పేలా లేవు. 


ఇక  ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే ఫుల్ రన్ లో ఇంకో 12కోట్ల వరకు రాబట్టాలి కానీ ఈ టాక్ తో అది అసాధ్యం.  దాంతో నాగార్జున ఆఫీసర్ , దేవదాస్ తరువాత మన్మథుడు 2 తో హ్యాట్రిక్ పరాజయాలను చవిచూశాడు.  ఫ్రెంచ్ మూవీ 'ఐ డు' కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో   రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించగా అక్షర గౌడ  , ఝాన్సీ. లక్ష్మి , రావు రమేష్  ముఖ్య పాత్రల్లో నటించారు.  నాగార్జున , జెమినీ కిరణ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: