టాలీవుడ్లో సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత బాగా ఏర్పడింది. సీనియర్ హీరోలకు హీరోయిన్లను వెతకడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం హీరోయిన్లు మాత్రం యంగ్ హీరోలతో నటించడమే కాకుండా వారి తండ్రులతోనూ నటిస్తున్నారు. గతంలో శ్రీదేవి కూడా అక్కినేని నాగేశ్వరావుతో పాటు అక్కినేని నాగార్జునతో కూడా రొమాన్స్ చేసింది. అయితే ఇదే తరహాలో టాలీవుడ్ హీరోయిన్లు వరసలతో సంబంధం లేకుండా అటు కొడుకులతో ఇటు తండ్రులతో కూడా నటిస్తున్నారు.
కాజల్ అగర్వాల్ - `లక్ష్మీ కల్యాణం` సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ మెగా హీరోలదంరితోనూ నటించింది. అలాగే రామ్ చరణ్తో కలిసి నటించిన కాజల్ ఇటు తండ్రి చిరంజీవితోనూ మరియు పవన్ కళ్యాణ్ సరసన కూడా నటించింది. ఇటు `ఆర్య 2` లో అల్లు అర్జున్కు జోడిగా కూడా నటించింది.
నయనతార - నయనతార సీనియర్ జూనియర్ అని తేడా లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తుంది. ఈ కేరళ బ్యూటీ ఎన్టీఆర్కు జోడీగా `అదుర్స్` సినిమాలో నటించింది. అలాగే బాలకృష్ణతో జైసింహా, సింహా, శ్రీరామరాజ్యం వంటి సినిమాల్లో నటించింది.
శ్రియాశరన్- నందమూరి హీరోల్లో ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ, వీరిద్దరి సరసన శ్రియా నటించింది. వరసలతో సంబంధం లేకుండా `నా అల్లుడు` సినిమాలో ఎన్టీఆర్తోనూ, పైసా వసూల్, గౌతమీపుత్ర శాతకర్ణి, చిన్న కేశవరెడ్డి సినిమాల్లో నటించింది.
నయనతార- దగ్గబాటి హీరోలైన వెంకటేష్ మరియు రానాలతో కలిసి కూడా నటించింది. కృష్ణంవందే జగద్గురుం సినిమాలో నటించిన నయనతార ఇటు అన్న వెంకటేష్ సినిమాలైన బాబు బంగారం, తులసిలో నటించింది.
ప్రియమణి- 'ఎవరే అతగాడు` సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ప్రియమణి 'యమదొంగ'లో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మనస్సులో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. అలాగే ఇటు బాలకృష్ణ సరసన కూడా ప్రియమణి నటించింది.
త్రిష- ప్రభాస్ సరసన `వర్షం` సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన త్రిష తన నటనతో అందరిని ఆకట్టుకుంది. `లయన్` సినిమాలో బాలయ్య సరసన నటించిన త్రిష్ `దమ్ము` సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించింది.
అమీషాపటేల్ - ఎన్టీఆర్ సరసన నరసింహుడులో నటించిన అమీషాపటేల్ బాలకృష్ణ సినిమాలో `పరమవీర చక్ర`లో కూడా నటించింది. అలాగే తెలుగులో అమీషాపటేల్ చాలా తక్కువ సినిమాలే చేసింది.
ఛార్మి- తన అందంతో ఆకట్టుకునే ఛార్మి `రాఖీ` సినిమాలో ఎన్టీఆర్తో రొమాన్స్ చేసింది. వరసలతో సంబంధం లేకుండ ఇటు బాలకృష్ణతో కూడా అల్లరి పిడుగు సినిమాలో నటించింది.
తమన్నా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన `గంగతో రాంబాబు` సినిమాలో మంచి మాసాలా రోల్లో నటించింది. అలాగే అల్లు అర్జున్ మరియు రామ్చరణ్ సినిమాల్లో కూడా నటించి మెగా హీరోలను కవర్ చేసింది. ఇప్పుడు సైరాలోనూ ఓ కీలక పాత్రలో చేస్తోంది.
శృతిహాసన్- కమల్ హాసన్ కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ మెగా హీరోల సరసన నటించింది. కాటమరాయుడు, గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్తో రొమాన్స్ చేసిన శృతి ఇటు అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాలో కూడా నటించింది.
సమంత- ఏ మాయ చేశావే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్తో రొమాన్స్ చేసింది. అయితే ఎలాంటి వరసలు సంబంధం లేకుండా మెగా హీరోల్లో అల్లు అర్జున్ మరిచు రామ్చరణ్ సినిమాలో నటించింది.
లావణ్యత్రిపాఠి- `అందాల రాక్షసి` సినిమాలో తన నటనతో ఎంతగానూ ఆకట్టుకున్న లావణ్య `సోగ్గాడే చిన్నినాయన` నాగార్జున సరసన నటించింది. అలాగే ఇటు కొడుకుతో చైతుతో కలిసి `యుద్ధం శరణం` సినిమాలో నాగచౌతన్యతో రొమాన్స్ చేసింది.
రకుల్ ప్రీత్ సింగ్ - తాజాగా విడుదల అయిన మన్మథుడు 2 సినిమాలో నాగార్జునతో రొమాన్స్ చేసిన రకుల్ ఎలాంటి వరసలతో సంబంధం లేకుండా `రారండోయ్ వెడుకు చూద్దాం` సినిమాలో నాగచైతన్య సరసన నటించింది.