నిన్న సాయంత్రం ముంబాయిలో ‘సాహో’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. జాతీయమీడియా ప్రతినిధులు అంతా పాల్గొన్న ఈ ఫంక్షన్ లో ప్రభాస్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఈ సినిమా కోసం తాను మానసికంగా సిద్ధం కావడానికి చాలసమయం పట్టింది అంటూ ఈమూవీలో అతి క్లిష్టమైన యాక్షన్ సీన్స్ ఉన్న నేపధ్యంలో అలాంటి క్లిష్టమైన సీన్స్ చేస్తూ రిస్క్ చేయవద్దని తన సన్నిహితులు ఎందరో తనకు సలహాలు ఇచ్చిన విషయాన్ని ప్రభాస్ బయటపెట్టాడు.

అయితే ఈ మూవీకి ఉన్న కథ రీత్యా అలాంటి యాక్షన్ సీన్స్ లో నటించినప్పుడు మాత్రమే గుర్తింపుతో పాటు ఘన విజయం వస్తుందన్న ఆలోచనతో ఈసినిమా కోసం తాను చేసిన అనేక రిస్క్ లు బయటపెట్టాడు ప్రభాస్. ఇదే సందర్భంలో ఈ మూవీ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గురించి మాట్లాడుతూ ఆమెకు తెలుగు నేర్చుకునే విషయంలో తాను ఏమాత్రం సహాయం చేయలేకపోయినా తనకు హిందీ నేర్పించే విషయంలో మాత్రం శ్రద్దా కపూర్ తనకు ఎంతో సహాయం చేసిన విషయాన్ని బయటపెట్టాడు.

ఇది ఇలా ఉండగా నిన్న విడుదలైన ఈమూవీ ట్రైలర్ కు అనూహ్య స్పందన వస్తోంది.  ముఖ్యంగా ఈ ట్రైలర్ లో ఈ మూవీ కథ గురించి ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోయినా ఈ ట్రైలర్ ను కట్ చేసిన విధానం యూత్ కు బాగా కనెక్ట్ అయిపోయింది. ఈ ట్రైలర్ లోని ప్రతి షాట్ చూసిన వారికి ‘సాహో’ లో ఒక విజువల్ వండర్ ను చూడబోతున్నారు అన్న సంకేతాలు వస్తున్నాయి. 

‘గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు స్టేడియంలో కొట్టే వాడికే ఒక రేంజ్ ఉంటుంది’ అంటూ ప్రభాస్ చెప్పిన పంచ్ డైలాగ్ విపరీతంగా అందరికీ కనెక్ట్ కావడంతో తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ‘సాహో’ మ్యానియా ప్రారంభం అయింది. కేవలం ఉత్తర భారత దేశంలో 4500 స్క్రీన్స్ లో విడుదల అవుతూ దేశవ్యాప్తంగా 6వేల స్క్రీన్స్ కు పైగా విడుదలకాబోతున్న ‘సాహో’ మొదటిరోజు కలక్షన్స్ 250 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు అంటూ వస్తున్న వార్తలు ఈమూవీని మ్యానియాను సూచిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: