ఫిదా చిత్రం తో టాలీవుడ్ ని షేక్ చేసిన హైబ్రిడ్  పిల్ల భానుమతి సాయి పల్లవి కి ఈ  ఏడాది అంతా కలిసి వచ్చినట్లు కనిపించడం లేదు.  తెలుగులో ఇప్పటి వరకు సాయి పల్లవి  నటించిన పడి పడి లేచే మనసు ఒక్క చిత్రం మాత్రమే రిలీజ్ అయింది . ఈ చిత్రం కూడా  ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు . ఇక సాయి పల్లవి ఎన్నో ఆశలు పెట్టుకుని ,  కోలీవుడ్ లో  సూర్యతో కలిసి నటించిన ఎన్జీకే చిత్రంలోని ఆమె  పాత్ర  విమర్శల పాలైంది.


  ఇక మలయాళంలో సాయి పల్లవి లీడ్ రోల్ లో  నటించిన ఓ సైకో థ్రిల్లర్ చిత్రాన్ని  తెలుగులోకి డబ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించారు.  అనుకోని అతిధి పేరు ఈ  చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది  ఏప్రిల్ లో అథిరన్  పేరుతో కేరళ లో రిలీజ్ అయిన ఈ చిత్రం అక్కడ ఓ మాదిరిగా విజయాన్ని సాధించింది.  అదే చిత్రాన్ని అనుకోని అతిధి పేరుతో తెలుగులోకి డబ్ చేస్తుండడంతో ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందోనని మేకర్స్ ఉత్కంఠగా  ఉన్నారు.  ఈ చిత్రం గనుక ఆశించిన స్థాయిలో విజయం సాధిస్తే, టాలీవుడ్ లో  సాయిపల్లవి కెరీర్  మరోసారి ఊపందుకుంది అవకాశాలు ఉన్నాయి.


 ప్రస్తుతం రానా హీరోగా వేణు అడుగుల  దర్శకత్వంలో విరాటపర్వంలో నటించేందుకు ఓకే చెప్పిన సాయి పల్లవి,  తనకు ఫిదా చిత్రం ద్వారా బ్రేక్ నిచ్చిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా  మరొక చిత్రాన్ని చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రానా విదేశాల నుంచి తిరిగి రాగానే విరాటపర్వం చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది . 


మరింత సమాచారం తెలుసుకోండి: