విలక్షణ నటుడిగా పేరుగాంచిన అడవి శేషు సినిమాల పై ఉండే మోజుతో అమెరికాలో మంచి సంపాదన ఉన్న ఉద్యోగాన్ని వదులుకుని ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఇతడు నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎవరు’ రేపు విడుదల కాబోతోంది. ఈమూవీ శర్వానంద్ ‘రణరంగం’ తో పోటీగా విడుదలకాబోతున్న నేపధ్యంలో ఈ ఇండిపెండెన్స్ డే మూవీల రేస్ లో ఎవరు విజేత అవుతారు అన్న విషయమై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

ఆశ్చర్యకరంగా ఈ మూవీని ఒక ఆఫీసు బాయ్ కి అంకితం ఇచ్చినట్లుగా అడవి శేషు మీడియా మీట్ లో చెప్పడం షాకింగ్ గా మారింది. ఆ సక్తికరమైన ఈవిషయానికి సంబంధించిన వివరాలలోకి వెళితే కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. అడవి శేషు ‘క్షణం’ సినిమాలో చేస్తున్నప్పుడు ఆ సినిమాను నిర్మిస్తున్న పివిపి సంస్థ ఆఫీస్ బాయ్ తన ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఎదో ఒక చిన్న సినిమా పనుల కోసం తాను పివిపి ఆఫీసులో ఉద్యోగం చేస్తున్న విషయాన్ని ఆ ఆఫీసు బాయ్ తన ఫ్రెండ్ కు చెప్పడం అడవి శేషు విన్నాడట.

అంతేకాదు ఆ ఆఫీసు బాయ్ అడవి శేషు తన వెనక ఉన్నాడు అన్న విషయం గమనించకుండా ‘క్షణం’ మూవీ గురించి నెగిటివ్ గా మాట్లాడుతూ ఏదో ఒక పనికిరాని చిన్న సినిమా అంటూ తన సినిమాను అనడంతో తనకు కసి పెరిగి ఆ సినిమా సక్సస్ కోసం తాను పడ్డ పాట్లను వివరించాడు. అంతేకాదు ఒక విధంగా తనకు కసి పెరగడంలో ఆ ఆఫీసు బాయ్ చేసిన కామెంట్స్ ఎంతో మేలు చేశాయని అందుకే ఆ ఆఫీసు బాయ్ మాటలు గుర్తు పెట్టుకుని మరీ ఆ ఆఫీసు బాయ్ కి తన లేటెస్ట్ మూవీ ‘ఎవరు’ సినిమాను అంకితం ఇవ్వడమే కాకుండా ఆ ఆఫీసు బాయ్ కి ఒక మంచి గిఫ్ట్ ను కూడ ఇచ్చాను అంటూ ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు అడవి శేషు. 

ఇదే సందర్భంలో తన లేటెస్ట్ మూవీ ‘ఎవరు’ గురించి మాట్లాడుతూ ఈ సినిమాను ఇప్పటి వరకు సినిమా రంగంతో సంబంధం లేని సుమారు 1000 మంది డాక్టర్లు లాయర్లు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు స్టూడెంట్స్ కు చూపెట్టానని వారంతా ఈ మూవీ బాగుంది అని చెప్పడంతో ఈ మూవీ పై తనకు భారీ అంచనాలు ఉన్నాయి అని అంటున్నాడు. ఈ సినిమాను విడుదలకు ఒక రోజు ముందుగానే ఈరాత్రి మీడియా వర్గాలతో పాటు కొంతమంది ప్రముఖులకు ప్రీమియర్ షోను వేసి చూపెడుతున్న నేపధ్యంలో ఈమూవీ
టాక్  ఈ రాత్రికే బయటకు వచ్చే ఆస్కారం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: