ప్రభాస్ సాహో సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఆగష్టు 30 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది. దీనికి సంబంధించిన ట్రైలర్ ను ఇటీవలే ముంబైలో రిలీజ్ చేశారు. బాలీవుడ్ లో టి సీరీస్ సంస్థ ఈ సినిమాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు.
ట్రైలర్ రిలీజ్ తరువాత హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో ప్రభాస్ అనేక విషయాలు చెప్పారు. అయితే, హైదరాబాద్ సాహో కు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నారు. ఈనెల 18 వ తేదీన రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున ఈ వేడుకను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా లక్ష మంది వరకు ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వేడుకకు హాజరు కాబోతున్నారని వినికిడి. ఈనెల 18 జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా యూనిట్ అంతా పాల్గొనబోతున్నది. హైదరాబాద్ వేడుక తరువాత దేశంలో వివిధ నగరాల్లో ఈ వేడుకను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నది. బెంగళూరు, చెన్నై, కోచి, ఢిల్లీ, దుబాయ్ లో ఇంకా వేడుకలు నిర్వహించాల్సి ఉన్నది.
సమయం తక్కువగా ఉండటంతో వీలైనంత త్వరగా వేడుకల కోసం ఏర్పాట్లు చేస్తున్నది సాహో యూనిట్. పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇండియాస్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ గా పేరు తెచ్చుకున్నది. విజువల్ పరంగా గ్రాండ్ గా సినిమా ఉండబోతున్నది. అయితే, సాంగ్స్ సినిమాకు మైనస్ అయ్యాయి. రిలీజ్ చేసిన రెండు సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇదే ఈ సినిమాకు మైనస్ అయ్యింది. హిందీ పాటలను తెలుగులో డబ్ చేసినట్టుగా ఉన్నాయి. మరో పాటను రిలీజ్ చేయాల్సి ఉన్నది.