ఈనెల 18న రామోజీ ఫిలిం సిటీలో అత్యంత భారీ ఏర్పాట్ల మధ్య జరగబోతున్న ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఈ మూవీ నిర్మాతలు చేస్తున్న ఏర్పాట్లు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ సినిమాకు జరగని స్థాయిలో ‘సాహో’ ఫంక్షన్ ఉండబోతున్నట్లు టాక్. 

ఈ ఈవెంట్ కు సంబంధించి లక్ష పాసులు ప్రభాస్ అభిమానుల కోసం పంపిణీ చేయబోతున్నారు అన్నవార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మన ఇరు రాష్ట్రాలలోని ప్రభాస్ అభిమాన సంఘాల నాయకులను టచ్ లోకి తీసుకుని ఈ పాసుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన విషయాలను ఈ మూవీ నిర్మాతలు చర్చలు చేస్తున్నట్లు టాక్.

ఈ ఫంక్షన్ తో ‘సాహో’ మ్యానియాను పీక్ కు తీసుకువెళ్ళి మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా ‘సాహో’ మాటలే వినిపించేలా చేసి ఈ మూవీ టిక్కెట్లను ఆన్ లైన్ లో ఒక వారం రోజులు ముందు నుండి అందుబాటులోకి తీసుకు వచ్చి మొదటి వారం టిక్కెట్లు అన్నీ ముందుగానే అయిపోయేలా మాస్టర్ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీకి పనిచేసిన యూనిట్ సభ్యులు అందరితోపాటు ప్రభాస్ కు నేషనల్ స్టార్ ఇమేజ్ ని తీసుకు వచ్చిన ‘బాహుబలి’ యూనిట్ కీలక వ్యక్తులను కూడ ఈ మూవీ ఫంక్షన్ కు పిలుస్తున్నట్లు సమాచారం.

ప్రభాస్ కు విపరీతమైన పట్టు ఉన్న గోదావరి జిల్లాలలో ‘సాహో’ విడుదల సందర్భంగా మోటర్ బైక్ ర్యాలీలతో పాటు ఈ మూవీలో ప్రభాస్ ఉపయోగించిన 5 కోట్ల విలువైన కారును మన తెలుగు రాష్ట్రాలలోని ప్రతి ముఖ్య కేంద్రానికి ఈ నెల 20 నుండి పంపబోతున్నట్లు సమాచారం. లక్షమంది అభిమానులను ‘సాహో’ ఫంక్షన్ కు రప్పించే ఆలోచన సినిమా పబ్లిసిటీ రీత్యా బాగానే ఉన్నా ఎటువంటి సంఘటనలు జరగకుండా ఈ మూవీ ఫంక్షన్ ను ప్రశాంతంగా నిర్వహించడం అంత సులువైన పని కాదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: