ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఆగస్టు 15 అంటే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు.. తెల్లదొరల దొరతనం నుండి విముక్తి కలిగిన రోజు.. అందుకే ఈరోజును దేశమంతా పండుగ జరుపుకుంటారు. అందుకే ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజుగా పిలుస్తారు. అయితే, విషయానికొస్తే.. ఈరోజు సినీ ఇండస్ట్రీకి కూడా చాలా ప్రత్యేకమైన రోజంటారు. ఎందుకంటే చాలా సినిమాలు ఈరోజు రిలీజ్ కు ముహూర్తం పెట్టుకున్నారు. 


కేవలం సినిమాలే కాదు సినిమాలకు సంబందించిన పోస్టర్లు.. ట్రైలర్స్.. సాంగ్స్ చాలా రిలీజ్ అయ్యాయి. ఇకపోతే గత ఏడాది ఈ రోజు రిలీజ్ అయినా సినిమాలైతేనేమి.. సాంగ్స్ అయితేనేమీ ఒక ప్రభంజనాన్ని సృష్టించి టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసాయి కూడా. అయితే, ఈరోజు కూడా టాలీవుడ్ లోని చాలా సినిమాలు పోస్టర్లను, ట్రైలర్లను, సాంగ్స్ ను విడదల చేశారు. 


వాటి విషయానికొస్తే అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా అల వైకుంఠపురంలో.. సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. అలాగే మహేష్ బాబు, రష్మిక మందాన నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా నుండి ఒక పాటను కూడా రిలీజ్ చేశారు. ఇకపోతే ఈ రోజు అడవి శేషు నటించిన 'ఎవరు', అలాగే శర్వానంద్ నటించిన 'రణరంగం' సినిమాలు రిలీజ్ అయ్యాయి.  అంతే కాదు సైరా నుంచి మెగాస్టార్ చిరంజీవి ఫైనల్ లుక్, శంకర్-కమల్ హాసన్ కాంబినేష్ లో వస్తున్న భారతీయుడు 2 ఫస్ట్ లుక్, మాస్ మహరాజ రవితేజ నటిస్తున్న ‘డిస్కోరాజా’ చిత్రం ఫస్ట్ లుక్ ఇలా సోషల్ మీడియాలో తెగ సందడి చేశాయి. 

ఆ సినిమాలు కూడా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసే దిశాగా కలెక్షన్ తో దూసుకు పోతున్నాయి. మొత్తానికి చూసుకుంటే ఈరోజు సినిమా వాళ్లకు కూడా కలిసొచ్చిన రోజని మరొకలా చెప్పనక్కర్లేదు. మరి ఈరోజు రిలీజ్ సినిమాలు బక్సాఫీసును షేక్ చేస్తాయో లేదో చూడాలి.  ఈ సంవత్సరం వచ్చే సవంత్సరం కూడా టాప్ హీరోల చిత్రాలు రెడీ అవుతున్నాయి. తెలుగు ప్రేక్షకులు తమ అభిమాన హీరోల చిత్రాల కోసం ఎదురు చూస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: