బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా ఓ ట్విట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.  ఈ రోజు 73 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన వినూత్న రూపంలో అందరికీ విషెస్ తెలిపారు.  ఎప్పుడూ వివాదాలతో అప్పుడప్పుడు హ్యాపీ న్యూస్ తో సోషల్ మీడియాలో కనిపించే సల్మాన్ ఖాన్ ఏది చేసినా వెరైటీగానే ఉంటాయి.  ఎంత సూపర్ హీరో అయినా కొన్ని సార్లు సల్మాన్ చేసే పనులు వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకుంటాడు.  కృష్ణ జింక, హిట్ అండ్ రన్ కేసు ఇలా ఎన్నో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.  దాదాపు జైలు దాకా వెళ్లాల్సి వచ్చినా బతికి బయట పడుతున్నాడు. 

అయితే సల్మాన్ పై ఎంత నెగిటీవ్ ఉందో..అంతకన్న పాజిటీవ్ టాక్ కూడా ఉంది. సల్మాన్ ఖాన్ నడుపుతున్న  ‘బీయింగ్ హ్యూమన్’ సంస్థ ద్వారా ఎంతో మంది లబ్ది పొందుతున్నారు. ముఖ్యంగా అనాథ పిల్లలు, వృద్దులు ఈ ట్రస్ట్ ద్వారా తమ కష్టాలు మర్చిపోతున్నారు.  అంతే కాదు స్వయంగా సల్మాన్ ఖాన్ వెళ్లి అక్కడ వారిని ఆనంద పరుస్తుంటారు..వారి కష్టాలు స్వయంగా అడిగి తెలుసుకుంటారు. ఇక తన ఫ్యాన్స్ ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే వెంటనే వారికి సహాయం అందిస్తాడు. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే ‘బిగ్ బాస్’ రియాల్టీ షో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. 

ఇప్పటికే బాలీవుడ్ లో 12 సీజన్లు పూర్తి చేసుకుంది. నేడు 73 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సల్మాన్ ఖాన్ పంపిన ట్విట్ అందరినీ ఆకర్షిస్తుంది.  యాధృచ్చికంగా తీయించుకున్నారో..కావాలని తీయించుకున్నారో సల్మాన్ ఖాన్ ముగ్గురు అన్నదమ్ములు జాతీయ పథాకాన్ని తమ దుస్తుల ద్వారా ఆవిష్కరించినట్లు ఉంది. సల్మాన్‌ కషాయ రంగు టీ షర్టు వేసుకోగా, సోహైల్‌ తెలుపు రంగు, అర్భాజ్‌ ఆకుపచ్చ రంగు టీ షర్టులు ధరించారు. ఈ ఫోటో నెటిజన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.  తాజాగా ఈ ఫోటో సల్మాన్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. అలాగే స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇండియా అంటూ, అందరూ బాగుండాలని, అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: