పడి పడి లేచె మనసు తరువాత  ట్యాలెంటెడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం రణరంగం నిన్న విడుదలై  మిక్సడ్ రివ్యూస్ ను రాబట్టుకుంది. అయితే నిన్న సెలవు దినం కావడంతో  తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కు  మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఏపీ &తెలంగాణ లో ఈ చిత్రం 3.8 కోట్ల షేర్ ను రాబట్టిందని సమాచారం. కాగా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ఈ చిత్రం 8.1 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. శర్వా కెరీర్ లో ఇదే బెస్ట్ ఓపెనింగ్ కావడం విశేషం. 


ఇక ఇదిలా ఉంటే ఓవర్సీస్ లో మాత్రం ఈచిత్రం అనుకున్న స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోతుంది.  మొదటి రోజు ఈ చిత్రం అక్కడ కేవలం  $20,486డాలర్ల వసూళ్లను మాత్రమే రాబట్టి డిజాస్టర్ దిశగా పయనిస్తోంది.  అయితే యూఎస్ఏ లో ఈ సినిమాకు ప్రీమియర్లు పడి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది.  ప్రీమియర్లను రద్దు చేసి ఇండియా తో పాటు ఒకే టైం కు విడుదలచేయడంతో అంత తక్కువ వసూళ్లను రాబట్టింది. 



కాగా ఈ చిత్రానికి  అడివి శేష్ 'ఎవరు' నుండి గట్టి పోటీ ఎదురవుతుంది.  ఆ సినిమా కు పాజిటివ్ రివ్యూస్ రావడంతో రణరంగం కు దెబ్బ పడేలా కనిపిస్తుంది. ఇప్పటికే ఈచిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ లో 30 శాతం రికవరీ చేసింది. మరి ఈ వారాంతం  ఇదే జోరును కొనసాగిస్తే మాత్రం ఈసినిమా  సేఫ్ అవ్వడం ఖాయం. 'స్వామి రారా' ఫేమ్  సుధీర్ వర్మ దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ డ్రామా గా తెరకెక్కిన  ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ,  కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్లుగా నటించగా  సితార ఎంటర్టైన్మెంట్స్ ఈచిత్రాన్ని నిర్మించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: