పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండల మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటన వచ్చి కొద్ది రోజులు గడవకుండానే ఈ మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి మరో హాట్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీలో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ ను ఒప్పించడానికి ఛార్మీ తన వంతు ప్రయత్నాలను చాల పెద్ద స్థాయిలో చేస్తున్నట్లు తెలుస్తోంది. 

దీనికోసం ఛార్మీ ఇప్పటికే జాహ్నవి తండ్రి బోనీకపూర్ అపాయింట్ మెంట్ అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండకు కరణ్ జోహార్ తో ఉన్న పరిచయం రీత్యా ఛార్మీ ఏదో విధంగా జాహ్నవిని ఈమూవీలో హీరోయిన్ గా ఒప్పించగలిగితే ఈమూవీ ప్రాజెక్ట్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడి మార్కెట్ చాల సులువుగా అయిపోతుందని ఛార్మీ ఆలోచన అని అంటున్నారు.

‘ఇస్మార్ట్ శంకర్’ ఇచ్చిన సక్సస్ తో మంచి జోష్ మీద ఉన్న పూరీకి మరొక విజయం వెంటనే కావాలి. అలాగే ‘డియర్ కామ్రేడ్’ పరాజయంతో సతమైపోతున్న విజయ్ కు ఒక భారీ హిట్ కావాలి. దీనితో వీరిద్దరి కాంబినేషన్ తో రాబోతున్న మూవీకి జాహ్నవి సహాయం ఉంటే ఈమూవీ ప్రారంభం నుండి పాజిటివ్ టాక్ తో నడుస్తుందని ఛార్మీ ఆలోచన. 

కరణ్ జోహార్ నిర్వహించే ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో ఆ మధ్య పాల్గొన్న జాహ్నవి తాను దక్షిణాది సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తే అది విజయ్ దేవరకొండ సినిమాతోనే అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఛార్మీ రాయబారాలు కూడ మొదలు అయ్యాయి కాబట్టి పూరీ మాటల మాయలో జాహ్నవి పడిపోతే ఇక విజయ్ పూరీల మూవీకి ఎదురులేదు. వచ్చే సంవత్సరం ప్రారంభంలో సెట్స్ పైకి రాబోతున్న ఈ మూవీని చాల వేగంగా పూర్తి చేసి పూరీ తన క్రేజ్ ను మరింత పెంచుకోబోతున్నాడు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: