మెగా హీరోలు ఒకే వేదికపై కలిస్తే ఎట్టా ఉంటాది.. మెగా హీరోలంతా కలిసి మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తే ఎట్టా ఉంటాది.. ఫ్యాన్స్ కు పెద్ద పండుగే అవుతుంది. అందరూ ఒకే వేదికపై కలవడం ఎప్పుడు జరగలేదు. ఒకరిద్దరు కలుస్తుంటారు. మెగా హీరోలు ఒకే చోట కలిస్తే అక్కడి సందడి వేరు. ఈ సందడికి మెగాస్టార్ పుట్టినరోజు ఓ వేడుక కానున్నది. అవును.. ఇది నిజం. అయితే, మెగాస్టార్ ఎప్పటిలాగే తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటున్నారు.
శిల్పకళా వేదికలో మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు జరగబోతున్నాయి. ఈ వేడుకకు మెగాస్టార్ అభిమానులు హాజరు కాబోతున్నారు. చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరు హాజరవుతుంటారు. ఇప్పుడు ఈ ఇద్దరితోపాటు వరుణ్ తేజ్ ఇతర హీరోలు కూడా వస్తున్నారట. వీరితో పాటు స్పెషల్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు.
ఇది నిజంగా ఆహ్వానించదగిన విషయం అని చెప్పాలి. రంగస్థలం సక్సెస్ మీట్ లో రామ్ చరణ్ తో కలిశారు.. అలానే నాపేరు సూర్య సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ తో కలిశారు.. అందరితో పవన్ ఒకేసారి కలిసిన దాఖలాలు లేవు. ఇప్పుడు అందరు ఒకే వేదికపైకి వస్తే.. చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.
ఆగష్టు 22 న మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు జరగబోతున్నాయి. పవన్ హాజరవుతారని ప్రచారం జరుగుతున్నది. ఇది కేవలం ప్రచారం మాత్రమేనా లేదంటే నిజంగానే పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు తెలియాలి. పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు హాజరైతే ఆరోజున మెగా పండుగ అనే చెప్పాలి. సైరా టీజర్ కు పవన్ వాయిస్ ఓవర్ అందించారు. ఆ వాయిస్ ఓవర్ ఎలా ఉన్నది. ఎంతవరకు వర్కౌట్ అయ్యిందినే విషయాలు తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే.