సీనియర్ దర్శకుడు భీమనేని శ్రీనివాస రావు దర్శకత్వంలో నటి ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా కౌసల్య కృష్ణమూర్తి. కొంత గ్యాప్ తరువాత క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఎస్ రామరారావు గారి తనయుడు వల్లభ నిర్మాతగా నిర్మించిన ఈ సినిమా టీజర్ మరియు వీడియో సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజై, వీక్షకుల నుండి మంచి స్పందనను సంపాదించాయి. ఇటీవల తమిళంలో రిలీజ్ అయి మంచి సక్సెస్ ని సాధించిన కనా అనే సినిమాకు అఫీషియల్ రిమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఈ సినిమా అధికారిక ట్రైలర్ ను నేడు సినిమా యూనిట్ యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగింది. 

ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన కౌసల్య అనే అమ్మాయి, తన తండ్రి క్రికెట్ ని ఎంతో ఇష్టపడడంతో, ఆయన కోరికను తీర్చడానికి తాను మహిళా క్రికెటర్ గా ఉన్నత స్థాయికి చేరడానికి ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొని, చివరకు తండ్రి కలను ఏవిధంగా సాకారం చేసింది అనే ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్, ఆద్యంతం ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందింది. ముఖ్యంగా ట్రైలర్ లో ఐశ్వర్య రాజేష్, రాజేంద్ర ప్రసాద్ ల నటన, డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ప్రముఖ తమిళ నటుడు శివ కార్తికేయన్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించడం జరిగింది. 'ఈ లోకం గెలుస్తాను అని చెపితే వినదు, కానీ గెలిచినవాడు చెపితే వింటుంది, కాబట్టి నువ్వు ఏది చెప్పినా గెలిచాక చెప్పు' అని టీజర్ లో వచ్చే డైలాగ్ ఎంతో ఆలోచింపచేస్తుంది. 

ఇకపోతే ఈ సినిమాలో క్రికెట్ తో పాటు రైతులకు సంబందించిన ఒక ప్రధాన అంశాన్ని గురించిన మంచి మంచి అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు సమాచారం. ఇక నేడు రిలీజ్ అయిన ట్రైలర్ కు వీక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో సినిమా యూనిట్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బ్యూటిఫుల్ హీరోయిన్ రాశి ఖన్నా ప్రత్యేక అతిథులుగా రేపు హైదరాబాద్ లో ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఎంతో వైభవంగా జరుగనుంది. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, సినిమాను ఈనెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: